Jump to content
  • 0

Cotton Candy: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం


TELUGU

Question

ఇప్పటికే నిషేధించిన తమిళనాడు, పుదుచ్చేరి

శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం

వీటికి ఉపయోగిస్తున్న రంగులతో క్యాన్సర్ వస్తుందన్న ఆహార భద్రత కమిషనర్ నివాస్

cr-20240221tn65d5c928dc11a.jpg

సాధారణంగా చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ... పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని తెలిపారు. రోడమైన్ బీ, మెటానిల్ ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియలకు నెల రోజుల సమయం పట్టొచ్చని తెలిపారు. కృత్రిమ రంగు లేని పీచుమిఠాయిలను తినడం కూడా సరైనది కాదని.. అపరిశుభ్ర పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తారని చెప్పారు.

...

Complete article

Also see this news

 

Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 0

Cotton Candy: ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచుమిఠాయిపై కర్ణాటకలో నిషేధం

ఇటీవల పీచు మిఠాయిపై పలు రాష్ట్రాల్లో నిషేధం

ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయన్న కారణంతో ప్రభుత్వాల నిర్ణయం

కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడుతున్న వంటకాలపై తాజాగా కర్ణాటకలో నిషేధాజ్ఞలు

cr-20240311tn65eee5b352526.jpg

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగులో ఉండే ఈ పీచు మిఠాయిలో హానికారక రసాయన పదార్థాలు ఉన్నాయన్న కారణంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి. 

తాజాగా, కర్ణాటక ప్రభుత్వం కూడా పీచు మిఠాయి అమ్మకాలపై కొరడా ఝళిపించింది. అంతేకాదు, ఫుడ్ కలర్ వాడిన మంచూరియా వంటకం పైనా కర్ణాటక సర్కారు నిషేధం ప్రకటించింది. దీనిపై కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడుతూ, ఫుడ్ కలర్ వాడే వంటకాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. 

రాష్ట్రంలో 171 రకాల వంటకాల శాంపిళ్లను అధికారులు పరిశీలించారని, అందులో 107 వంటకాల్లో ప్రమాదకర కృత్రిమ రంగులు వాడుతున్నట్టు గుర్తించారని వివరించారు. 

రోడమైన్-బి, టార్ట్రాజిన్ వంటి రసాయనాల వల్ల ఆహార పదార్థాలకు ఆకట్టుకునే కలర్ వస్తుందని, అయితే ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అందుకే వీటిపై కర్ణాటకలో నిషేధం విధించామని... ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచు మిఠాయి ఎవరైనా అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి దినేశ్ గుండూరావు స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...