Jump to content
  • 0

జగన్‌ పాలనంతా అబద్ధాలమయం


TELUGU

Question

జగన్‌రెడ్డి ఐదేళ్ల పా లనంతా అబద్ధాలతోనే సాగిందని మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం జ రిగిన మీడియా సమావేశంలో ఉగ్ర మాట్లాడా రు. హామీలపై మాటిచ్చి మడమ తిప్పి ప్రజలను మోసగించారని ఉగ్ర ధ్వజమెత్తారు.

6_881d73b6a5_V_gif--799x414-4g.webp

హామీలపై మడమతిప్పి మోసం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర ధ్వజం

కనిగిరి, ఫిబ్రవరి 23: జగన్‌రెడ్డి ఐదేళ్ల పా లనంతా అబద్ధాలతోనే సాగిందని మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం జ రిగిన మీడియా సమావేశంలో ఉగ్ర మాట్లాడా రు. హామీలపై మాటిచ్చి మడమ తిప్పి ప్రజలను మోసగించారని ఉగ్ర ధ్వజమెత్తారు. చం ద్రబాబు పాలనలో నాణ్యతతో టిడ్కో ఇళ్లను ని ర్మిస్తే అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి వాటి ని పేదలకు ఇవ్వకుండా గాలికొదిలేశార న్నా రు. చంద్రబాబు పాలనలో పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఎన్టీఆర్‌ హౌ సింగ్‌ కింద కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి కాలనీల పేరుతో లక్షలాది కోట్ల రూ పాయల ప్రజాధనాన్ని దుర్వినియో గం చేశా రని ఆరోపించారు. కేవలం సెంటు భూమిని అది కూడా ఊళ్లకు దూరంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే, మంత్రి ప్రజలకు ఒరగపెట్టిందేదీలేద న్నారు. ఐదేళ్లు ప్రజల సమస్యలను పట్టించుకో కుండా ఎన్నికల వస్తుండడంతో ఒంగోలులో ఇళ్ల పట్టాల పేరుతో సెంటు భూమిని ఇచ్చి రూ.కోట్లు మింగేందుకు ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. కనిగిరిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల తో పాటు రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చం ద్రబాబు పేదలకు ఇస్తారని ఉగ్ర హామీ ఇచ్చా రు. తల్లిని గెంటేసిన జగన్‌ చెల్లిపై కూడా కక్ష గట్టారన్నారు. షర్మిలను నడిరోడ్డుపై పోలీసుల తో ఈడ్చి తీసుకెళ్లడం దుర్మార్గ చర్యగా పేర్కొ న్నారు. జగన్‌ ఆరాచకపాలనపై వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్న పత్రికా కార్యాలయా లు, మీడియా ప్రతినిధులపై దాడులు చేయించడం, పత్రికా కార్యాలయాలపై దాడులు చే యించిన చరిత్రహీనుడు జగన్‌రెడ్డి అన్నారు. యువతకు ఉపాధిపై ఐఐటీ, వెలిగొండపై ఎ లాంటి ఊసే లేదన్నారు. ఇక జగన్‌కు 50 రోజులే గడువు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీపై గెలిచేది ఖాయమని, టీడీపీ సైన్యం అత్యధిక మెజార్టీ కోసం కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకు లు వీవీఆర్‌ మనోహరరావు, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, నంబుల వెం కటేశ్వర్లు యాదవ్‌, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్‌, యడవల్లి శ్రీనివాసులురెడ్డి, జంషీర్‌, గండికోట రమేష్‌, మూలె బ్రహ్మారెడ్డి, సైకం మాలకొండారెడ్డి, సి ద్దాటపు వెంకటరెడ్డి, బాలు ఓబులురెడ్డి, బుల్లా బాలబాబు, గుడిపాటి ఖాదర్‌, అహ్మద్‌, యువకిషోరం ఓబులురెడ్డి పాల్గొన్నారు.

మండలంలోని ఏరువారిపల్లి గ్రామంలోని వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందిన 60 కుటుంబాలు బిజ్జం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పా ర్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ఉ గ్ర వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు నకు కృషి చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి, సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు తాను సంకల్పించిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసు కెళ్లాల ని ఉగ్ర సూచించారు

...

Complete article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...