Jump to content
  • 0

AP ట్రాఫిక్‌ పద్మవ్యూహం!


TELUGU

Question

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి, రేగుపాలెం జంక్షన్‌లో గంటల తరబడి వాహనాలు నిలిపోయాయి.

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం వేచివున్న ప్రయాణికులు

సీఎం పర్యటనతో వాహనాలను దారి మళ్లించిన పోలీసులు

ఎలమంచిలి నుంచి లంకెలపాలెం వరకు హైవే బంద్‌

రేగుపాలెం జంక్షన్‌, అచ్యుతాపురంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

గంటల తరబడి నిలిచిపోవడంతో ఎండ, ఉక్కపోతతో ప్రయాణికులు ఇక్కట్లు

అనకాపల్లి టౌన్‌/ ఎలమంచిలి/ అచ్యుతాపురం, మార్చి 7:

7akp_town_13_6e5dc4b3c4_V_jpg--799x414-4

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి, రేగుపాలెం జంక్షన్‌లో గంటల తరబడి వాహనాలు నిలిపోయాయి. మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. పోలీసులు సీఎం సభ బందోబస్తులో వుండడంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టేవారు లేకపోయారు. మరోవైపు సీఎం సభకు ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను వినియోగించడంతో సాధారణ ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చేయూత పథకం నాలుగో విడత నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని అధికారులు గురువారం అనకాపల్లి మండలం పిసినికాడలో ఏర్పాటు చేశారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం జాతీయ రహదారి పక్కన వుండడంతో తుని వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలను రేగుపాలెం జంక్షన్‌, ఎలమంచిలి, అచ్యుతాపురం, పరవాడ మీదుగా లంకెలపాలెం వద్ద జాతీయ రహదారికి చేరేలా మళ్లించారు. అదే విధంగా విశాఖ వైపు నుంచి తుని వైపు వెళ్లే వాహనాలను కూడా ఇదే మార్గంలోకి మళ్లించారు. దీంతో లంకెలపాలెం, అచ్యుతాపురం జంక్షన్‌, రేగుపాలెం జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. సాధారణ రోజుల్లోనే అచ్యుతాపురం జంక్షన్‌ వాహనాలతో రద్దీగా వుంటుంది. సెజ్‌లోని కర్మాగారాల్లో విధులకు హాజరయ్యే కార్మికులు, ఉద్యోగులను తీసుకువచ్చే వందలాది బస్సులు జంక్షన్‌ మీదుగా వచ్చిపోతుంటాయి. ఇంకా యంత్ర సామగ్రితో భారీ వాహనాలు వస్తుంటాయి. దీనికి తోడు గురువారం అనకాపల్లి హైవే మీదుగా మీదుగా వెళ్లాల్సిన వాహనాలను అచ్యుతాపురం మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. అచ్యుతాపురం కూడలిలో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

హైవేపై 4 కి.మీ.ల మేర నిలిచిన వాహనాలు

తునివైపు నుంచి వచ్చే వాహనాలను ఎలమంచిలి పోలీసులు రేగుపాలెం జంక్షన్‌ నుంచి అచ్యుతాపురం రోడ్డులోకి మళ్లించేలా చర్యలు చేపట్టారు. అయితే ఈ మార్గంలో వెళితే ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో పలువురు లారీ డ్రైవర్లు వాహనాలను రోడ్డుపైనే ఆపేశారు. దీంతో రేగుపాలెం జంక్షన్‌ నుంచి పోతిరెడ్డి పాలెం జంక్షన్‌ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

ఇదిలావుండగా సీఎం సభకు వివిధ ప్రాంతాలను ప్రజలను తీసుకువచ్చిన వాహనాలను అనకాపల్లి సమీపంలోని కొత్తూరు జంక్షన్‌ నుంచి పిసినికాడ వరకు రోడ్డుకు ఇరువైపులా నిలుపుదల చేయడంతో ఆటోలు, కార్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దూరప్రాంతాలకు ప్రయాణించే వారు ఇబ్బంది పడ్డారు. కొత్తూరు జంక్షన్‌ నుంచి పిసినికాడ దాటడానికి సుమారు అరగంట సమయం పట్టింది.

సీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల పాట్లు!

ముఖ్యమంత్రి సభకు ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో అనకాపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అనకాపల్లి డిపోలో వంద బస్సులు వుండగా, వీటిలో 23 బస్సులను సభకు పంపారు. దీంతో విశాఖపట్నం, విజయనగరం, దేవరాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, తదితర రూట్లలో నడిచే సర్వీసులను అధికారులు తగ్గించారు.

...

Complete article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...