Jump to content
  • 0

Nara Lokesh: ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే పొత్తు: నారా లోకేశ్


TELUGU

Question

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు

ఉమ్మడి ప్రకటన చేసిన మూడు పార్టీల అధినేతలు

రాష్ట్ర చరిత్రలో ఈ పొత్తు మేలి మలుపు అన్న నారా లోకేశ్

cr-20240309tn65ec6e6472f16.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించి ఎట్టకేలకు బీజేపీతో పొత్తును సాధించారు. పొత్తుపై బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ అనే మూడు శక్తులు ఏకమయ్యాయని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిన రాష్ట్రానికి ఈ పొత్తు ఒక ముఖ్యమైన ఘట్టం అని అభివర్ణించారు. ఈ పొత్తు చరిత్రలో నిలిచిపోతుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు, ప్రజల జీవితాలకు ఇదొక సానుకూల మేలి మలుపు అని వివరించారు.

...

Complete article

 

Link to comment
Share on other sites

5 answers to this question

Recommended Posts

  • 0

Kesineni Nani: అమిత్ షా కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశారు: కేశినేని నాని

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న కేశినేని నాని

ఎంత మంది కలిసొచ్చినా జగన్ ను ఓడించలేరని వ్యాఖ్య

జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందన్న నాని

cr-20240309tn65ec4e0bdcccf.jpg

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని అన్నారు. మూడు రోజుల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశారని ఎద్దేవా చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఒరిగేది ఏమీ లేదని కేశినేని నాని అన్నారు. ఎంత మంది కలిసొచ్చినా ముఖ్యమంత్రి జగన్ ను ఓడించడం కల అని చెప్పారు. వైసీపీ 175కి 175 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. జనసైనికుల ఆత్మాభిమానాన్ని నారా లోకేశ్ వద్ద పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడేనని అన్నారు. టీడీపీ, జనసేనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ అందించిన సంక్షేమమే వైసీపీకి ఘన విజయాన్ని అందిస్తుందని నాని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Gudivada Amarnath: బీజేపీకి ఓటు వేస్తే జగన్ కు వేసినట్టేనని గతంలో చంద్రబాబు అనలేదా?: మంత్రి అమర్నాథ్

బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు

చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ విమర్శలు

జగన్ ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని వెల్లడి

cr-20240309tn65ec770e99093.jpg

బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కుదరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మకంగా స్పందించారు. కేఏ పాల్ పార్టీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితో ఎలాంటి సంబంధం అయినా పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు జగన్ కే పోతుందని గతంలో చంద్రబాబు అనలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పామని అన్నారు. తమకు పొత్తులతో అవసరం లేదని, ప్రజలతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు.

మేం చేసిన అభివృద్ధి చూసి ఓటేయమని జగన్ చెబుతుంటే... మా పొత్తులు చూసి ఓటేయండని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మేం సిద్ధం అని జగన్ అంటున్నారు... అమిత్ షా ఇంటి ముందు పొత్తులకు మేం సిద్ధం అని చంద్రబాబు, పవన్ అంటున్నారు అని ఎత్తిపొడిచారు. సీఎం జగన్ ను ఎదుర్కోవడం చేతకాక పొత్తులు పెట్టుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ విపక్ష నేతలను విమర్శించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu | రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు..పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

Chandrababu | ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తులు(Alliances ) ఖరారయ్యాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు వెల్లడించారు.

Chandra-Babu-11_V_jpg--816x480-4g.webp?s

అమరావతి : ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తులు(Alliances ) ఖరారయ్యాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu) పార్టీ నాయకులకు వెల్లడించారు. శనివారం ఢిల్లీలో పొత్తుల అంగీకారం అనంతరం పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌(Teleconference) నిర్వహించారు. పొత్తులు ఎందుకు చేసుకున్నామనే అంశంపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.

ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమే పొత్తులు చేసుకున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం ఎంతో అవసరమని మరోసారి స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్రంతో కలసి ఉండాలని పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

Kodali_Nani_On_Alliance_2a182c4d65_V_jpg

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ (NTR) తెలుగుదేశం పార్టీ పెడితే.. దానిని చంద్రబాబు లాక్కున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు పడి.. ప్రధాని మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అందుబాటులో లేకపోయినప్పటికీ వారి పీఏలతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు నల్ల చొక్కా వేసుకొని.. మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చంద్రబాబు పోరాటాలు చేశారని కొడాలి నాని గుర్తు చేశారు. భార్య, పిల్లలు లేని మోదీ.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. గతంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో (Congress Party) కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ గొప్పవాడని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నానని అంటున్నారని విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు.. అదే పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. వెయ్యి మంది మోదీలు, లక్ష మంది చంద్రబాబులు, కోటి మంది పవన్‌కళ్యాణ్‌లు (Pawan Kalyan) కలిసొస్తే ఎంత బలం ఉంటుందో.. అంతకన్నా లక్షల రెట్ల బలమున్న భగవంతుడి ఆశీస్సులు సీఎం జగన్‌కి ఉన్నాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Ambati Rambabu: అప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు.. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు.. ఇదీ బాబు నైజం: అంబ‌టి రాంబాబు

బీజేపీతో టీడీపీ పొత్తుపై ట్విట‌ర్ వేదిక‌గా అంబ‌టి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు

గ‌తంలో ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన వైసీపీ నేత‌

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు గారి నైజం అంటూ విమ‌ర్శ‌

cr-20240316tn65f546c8d2157.jpg

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఇలా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ నేత‌ అంబటి రాంబాబు 'ఎక్స్' ( గ‌తంలో ట్విట‌ర్‌) వేదికగా త‌న‌దైన శైలిలో స్పందించారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 

"అప్ప‌ట్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు బాబు. ఆ సమ‌యంలో ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని కూడా అన్నాడు. కానీ అప్పుడు ఎవరినైతే టెర్రరిస్ట్ అని అన్నాడో.. ఆ టెర్రరిస్ట్ కాళ్ళనే నేడు చంద్రబాబు పట్టుకుంటున్నాడు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు గారి నైజం అర్దమయ్యిందా..?" అంటూ అంబటి రాంబాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...