Jump to content
  • 1

AP CM Jagan | చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు : ఏపీ సీఎం జగన్‌ (CBN, Chandrababu)


TELUGU

Question

Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు

Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అనేది ఉండదని అన్నారు.

viajaysai-reddy_V_jpg--816x480-4g.webp?s

Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అనేది ఉండదని అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో విజయసాయి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిందేనని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా అంతే అని విమర్శించారు. బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి వేరే దారి లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్లే ఆ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించామని తెలిపారు. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని విజయ సాయి రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రం కూడా పరిమితి మించి అప్పులు చేయదని వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రజలు అలాంటి అసత్య ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో దుష్ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉందని.. ఐదేండ్లలో జగన్‌ వారి మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని స్పష్టం చేశారు.

...

Complete article

  • Best 1
Link to comment
Share on other sites

1 answer to this question

Recommended Posts

  • 1

AP CM Jagan | చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు : ఏపీ సీఎం జగన్‌

AP CM Jagan | చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని, ఆ తప్పు చేయవద్దని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM Jagan ) రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

YS-Jagan-25-1_V_jpg--816x480-4g.webp?sw=

అమరావతి : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని, ఆ తప్పు చేయవద్దని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM Jagan ) రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నిక ల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు చంద్రబాబు(Chandra Babu) కు ఇవే చివరి ఎన్నికలు కావాలని అన్నారు. నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

ఏపీలో జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమయ్యారని దుయ్యబట్టారు. తమ హయాంలో మూడు రాజధానిలు మొదలు, కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 14 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు ఏ ఒక్క మంచి స్కీం చేపట్టలేదని విమర్శించారు. చంద్రబాబు అంటే వెన్నుపోట్లు , బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు, వ్యవసాయం దండుగ అని గుర్తు కొస్తాయని, బాబు వస్తే కరువు వస్తుందని గుర్తుకొస్తుందని పేర్కొన్నారు.

50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ఇస్తున్నామని తెలిపారు. 2014లో ఇచ్చిన హామీ బాబు పాలనలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని, మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసే నాయకులు అవసరమా అంటూ ప్రజలను కోరారు. తాము 99 శాతం హామీలు అమలు చేశామని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...