Jump to content
  • 2

AP Volunteer system & pensions


TELUGU

Question

Erring village and ward volunteers will land in jail if TDP comes to power, says Naidu

The TDP-JSP combine is committed to early completion of Handri-Neeva and Galeru Nagari projects in undivided Chittoor district, apart from strengthening NTR and Krishnapuram reservoirs, says the TDP national president

10745_6_2_2024_19_13_13_2_IMG_20240206_W

Telugu Desam Party (TDP) national president N. Chandrababu Naidu has said that the village and ward volunteers are resorting to misdeeds and doing politics would only land in jail.

“You (volunteers) should realise the lies and betrayal of Chief Minister Y.S. Jagan Mohan Reddy and come forward to work as my star campaigners,” the former Chief Minister said while addressing the TDP’s ‘Raa Kadali Raa’ public meeting at Gangadhara Nellore, 10 km from here, on February 6 (Tuesday).

Mr. Naidu said that Mr. Jagan Mohan Reddy was spreading a feeling of insecurity among the volunteers. “I have always supported volunteers if they do good things. But they will not be spared if they resort to politics. I urge you to shun politics and serve the people,” Naidu said.

‘Nightmare for Dalits’

Alleging that the YSRCP government had become a nightmare for the Dalits in the State, Mr. Naidu said, “Mr. Jagan Mohan Reddy has undermined the self-respect of the Dalits and unleashed a reign of oppression against them. More than 180 Dalits have ended their lives in the State in the last five years, while more than 6,000 false cases have been foisted against them. Sub-Plan funds of ₹28,000 crore meant for Dalits have been diverted, and 27 welfare schemes meant for the communities have been withdrawn.” He appealed to the Dalits to unseat Mr. Jagan Mohan Reddy in the forthcoming elections.

...

Complete article

Link to comment
Share on other sites

  • Answers 51
  • Created
  • Last Reply

Top Posters For This Question

  • Sanjiv

    23

  • TELUGU

    20

  • Vijay

    9

Top Posters For This Question

Recommended Posts

  • 0

Naidu vows to make AP poverty-free, calls for vote to oust corruption

1074383-gfqmm3ubaaadeg8.webp

TIRUPATI: Telugu Desam chief Nara Chandrababu Naidu has launched a scathing attack on the YSRC government, stating his ambition for a poverty-free AP has turned into a "pipe dream" under Chief Minister Y.S. Jagan Mohan Reddy’s rule. Addressing a massive public gathering in GD Nellore constituency in Chittoor district, under the 'Raa Kadali Raa' campaign, Naidu has called upon the people to end the "lawlessness, corruption and misgovernance" in the state by voting out Jagan Mohan Reddy in the coming polls.

“Chief Minister Jagan Mohan Reddy is mentally disturbed as he is fearful of defeat in the polls,” he claimed. "My wish is for AP to be a number-one state globally. Today, it sadly risks sliding back to the Stone Age rather than moving towards a golden era. I will ensure that the assets of AP reached the poor and made the state poverty-free,” the TD chief maintained. Naidu claimed the people are now ready to vote out the YSRC government. Expressing concern over the rise in violence, he said the situation was so bad that the people were migrating for their livelihood.

Naidu said the TD was not opposed to the volunteer system but their primary duty should be to serve the people, not just YSRC leaders. "I will not spare these volunteers if they only serve YSRC interests," he warned. He felt the volunteers would end up in jail if they kept having faith in Jagan Mohan Reddy. “Chief Minister Jagan Mohan Reddy is deliberately creating insecurity among the volunteers by saying their services will be terminated if the TD wins power. Your jobs would be safe under a TD government if they serve the society,” Naidu said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Future leaders in coming days are volunteers.. my army is 2.6 lakhs volunteers: Jagan

Jagan: రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే.. నా సైన్యం 2.60 లక్షల మంది వాలంటీర్లే: జగన్

మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అన్న జగన్

యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ప్రశ్నించిన సీఎం

బాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని సూచన

cr-20240215tn65cdfb8b38d1c.jpg
 

రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే... మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

55 నెలలు పేదలకు సేవ చేశామని... పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. 

చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. బాబు మాటలను నమ్మితే నిండా మునిగి పోతారని ప్రతి రైతుకు చెప్పాలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే... ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకోవడమే అని చెప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువైపు తానొక్కడినే ఉన్నానని... అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, వారికి అనుకూలంగా ఉన్న టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మద్దతిస్తున్న మరో జాతీయ పార్టీ ఉన్నాయని చెప్పారు. తనకు అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వాలంటీర్లు ఉన్నారని తెలిపారు.

…

Complete article

Link to comment
Share on other sites

  • 0

Big Shock | ఏపీలో ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు

Big Shock | ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ (YCP) కి గట్టి షాక్‌ తగిలింది. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి.

Volunteers_V_jpg--816x480-4g.webp?sw=172

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి (CS Jawahar reddy) నుంచి ఉత్తర్వులు అందాయి. ఎన్నికల(Elections)  ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ఆయన పేర్కొన్నారు.. పోలింగ్‌ ఏజెంట్లుగానూ వాలంటీర్లు ఉండరాదని, ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

2019లో ఏపీలో వైసీపీ జగన్‌(YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 2 .48 వేల మందిని వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పనిలో పనిగా అనధికారికంగా పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఓటరు జాబితాలో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు అందడంతో వాటిని పరిశీలించిన అధికారులు వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఉత్తర్వులు వెలువడింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Lol this is actually a good move!

when cbn and associates lose the elections, they won’t be able to blame it on volunteers, manipulation, rigging, etc.

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: వాలంటీర్లలో ఇంజనీరింగ్ చదివినవాళ్లు కూడా ఉన్నారు... వాళ్లకు ఒకటే చెబుతున్నా: చంద్రబాబు

కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం

వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చిన టీడీపీ అధినేత

వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ

cr-20240326tn6602be20a2bf4.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 

"ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా... మీరు బయటికి రండి. ఇవాళ ఐదు వేలు జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చుని రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం" అని చంద్రబాబు వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

What about CBN's and Lokesh's jail threats to volunteers in the past?? Now greasing volunteers' palms. Too late!!

LOL :emoji-lol:

Link to comment
Share on other sites

  • 0

Volunteer system would be continued, no doubt in it: Naidu

Banaganapalle (Nandyal): The Telugu Desam party Chief Nara Chandrababu Naidu has reiterated that he will continue the Volunteer system. The after continuing to power I will change the fate of the volunteers. They are being paid a minimum of Rs.5000 salary but after TDP comes to power their salary would be hiked. Naidu told the volunteers not to favor the betrayals. `If your work for them then out cadres wont spare you. Instead of favoring the betrayals he asked them to work for democracy.

1434796-chandrababu-naidu.webp

Most of the volunteers are well educated but unfortunately they are being paid very less salary. Naidu assured while addressing Praja Galam public meeting here at Banaganapalle town on Friday. Addressing the public meeting Naidu assured the Volunteers not to fear that the system would be cancelled. He said they will continue the system and there is no doubt in it. Asserting Naidu said after the TDP party come to power, the educated volunteers would be imparted training in skill development so that they can earn at least a minimum amount of Rs.50 thousand per month.

Naidu assuring the women folks has said that his government will provide three LPG cylinders for free of cost. The women would be allowed to travel free in RTC busses. He also said to give Rs.3000 towards unemployment allowance besides announcing Mega DSC. We have conducted 12 DSCs, I had conducted 9 and the former CM NT Rama Rao 3 DSCs. But Jagan could not conduct even one DSC during his five years government.

He said to hike the pension to Rs.4000 and it would be given on 1st of every month. If anyone fails to receive at the first month then they would be given at the second month and if they fail to take even at the second month they would be given at the three months along with the two months pension, Naidu said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Election Commission: వాలంటీర్ల విష‌యంలో ఈసీ కీల‌క నిర్ణ‌యం!

పింఛ‌న్ల పంపిణీ నుంచి వాలంటీర్ల‌ను త‌ప్పించిన ఈసీ

హైకోర్టు ఆదేశాల మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఈఓ ముకేశ్ కుమార్‌మీనా వెల్ల‌డి

న‌గ‌దు పంపిణీ ప‌థ‌కాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచన‌

cr-20240330tn66081e2d1300a.jpg

ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాలంటీర్ల విష‌యంలో ఎల‌క్షన్ క‌మిష‌న్ (ఈసీ) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పింఛ‌న్ల పంపిణీ నుంచి వాలంటీర్ల‌ను త‌ప్పించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఈఓ ముకేశ్ కుమార్‌మీనా వెల్ల‌డించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న‌న్ని రోజులు వాలంటీర్ల‌కు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్ డిపాజిట్ చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

అలాగే న‌గ‌దు పంపిణీ ప‌థ‌కాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. కాగా, మాజీ ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజ‌న్ ఫ‌ర్ డెమోక్ర‌సీ' (సీఎఫ్‌డీ) న‌గ‌దు పంపిణీలో ఎట్టిప‌రిస్థితుల్లో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. సీఎఫ్‌డీ ఫిర్యాదును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy: తాము వస్తే వాలంటీర్ తరహా వ్యవస్థలేవీ ఉండని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు: సజ్జల

ఏపీలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరాదన్న ఈసీ

ఇది చంద్రబాబు పనే అంటూ సజ్జల ఫైర్

వాలంటీర్లపై కక్షగట్టారని ఆగ్రహం 

నేరుగా జోక్యం చేసుకోకుండా నిమ్మగడ్డ ద్వారా పోరాటం చేయిస్తున్నాడని ఆరోపణ

సచివాలయం ద్వారా పెన్షన్లు అందిస్తామని వెల్లడి

cr-20240331tn660959dcb6832.jpg

వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకోమాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణి చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందించారు. 

పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే తాము నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు.

సిటిజన్స్ ఫర్ డెమొక్రసీలో ఉండే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన విశ్వరూపం ప్రదర్శించారని, ఆయన టీడీపీ కార్యాలయం నుంచే ఆజ్ఞలు జారీ చేస్తున్నారా అనేంతగా మమేకం అయ్యారని ఆరోపించారు. పూర్తిస్థాయి టీడీపీ కార్యకర్తలా వ్యవహరించే నిమ్మగడ్డ, మరో ఇద్దరు ముగ్గురు కలిసి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ స్థాపించారని సజ్జల వివరించారు. 

వీళ్లు వాలంటీర్ వ్యవస్థపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కానీ కోట్లలో ఫీజులు వసూలు చేసే కపిల్ సిబాల్ వంటి న్యాయవాదిని రిటైరైన ఐఏఎస్ అధికారులు, రిటైరైన జడ్జిలు ఈ కేసుకు నియమించుకోవడం చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారో తెలుస్తుందని అన్నారు. వీళ్లకు ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యంపై ప్రేమ పుట్టుకొచ్చిందని, వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడమే వీరి లక్ష్యమని సజ్జల ధ్వజమెత్తారు.

సచివాలయం ద్వారా పెన్షన్లు అందిస్తాం

ఏపీలో పింఛనుదారులు ఆందోళనకు గురికావొద్దు. గ్రామగ్రామాన ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తాం. ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్లు అందిస్తాం. లబ్ధిదారులు తమ ప్రాంతంలోని సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవాలి. చంద్రబాబు వంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. మామూలు సర్టిఫికెట్ కావాలన్నా రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉంటుంది. 

కానీ వాలంటీర్ల వల్ల ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేలా చేస్తోంది వాలంటీర్లే. వాలంటీర్ల సేవలు ఆపేయాలని, సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది చంద్రబాబే. వాలంటీర్లను ఎందుకు వద్దంటున్నారు, సచివాలయ సిబ్బందిని ఎందుకు కావాలంటున్నారు? సచివాలయ సిబ్బంది కూడా జగనే నియమించారు కదా! తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థలేవీ ఉండవనే చంద్రబాబు తన చర్యల ద్వారా సందేశం ఇచ్చారు.

పవన్ విషయంలో మేం చెప్పిందే జరిగింది

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు మింగేస్తాడని మేం చెప్పాం. ఇప్పుడదే జరిగింది. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఆ ఇచ్చిన సీట్లలో కూడా చంద్రబాబు మనుషులే కనిపిస్తున్నారు. పిఠాపురంలో పవన్ ఇష్టం లేకుండానే పోటీ చేస్తున్నారు. ఎవరో పంపితే ఆయన పిఠాపురం వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు సీఎం సీఎం అనిపించుకున్న పవన్ ఇప్పుడు 21 సీట్లకు పరిమితం అయ్యారంటే కారణం ఎవరు? బీజేపీ పరిస్థితి కూడా అందుకు మినహాయింపు కాదు అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

ఇంటి వద్దకు పింఛన్‌!

ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకుంది. సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.

ఇంటి వద్దకు పింఛన్‌!

సచివాలయ సిబ్బందితో ఇప్పించాలని ప్రభుత్వ నిర్ణయం

రేపటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు

నేటికీ జిల్లాకు విడుదల కాని నిధులు

సెల్‌ఫోన్ల్లను అప్పగించిన వలంటీర్లు

cach_e15a28e98f_V_jpg--799x414-4g.webp

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 1 : ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకుంది. సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. తొలుత ఈనెల 3వ తేదీ నుంచి సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం విదితమే. వలంటీర్ల ద్వారా పింఛన్‌ సొమ్మును పంపిణీ చేయించవద్దని, సంక్షేమ పథకాల్లో వారి భాగస్వామ్యం వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లాలోని వలంటీర్లు సోమవారం తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లను, ట్యాబ్‌లు, బయో మెట్రిక్‌ పరికరాలను తిరిగి సచివాలయాలకు అప్పగించారు. పింఛన్‌ పంపిణీ బాధ్యతను అక్కడి సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల మూడో తేదీ నుంచి పంపిణీ చేయాలని మార్చిలోనే నిర్ణయించింది. కాగా దీనిపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి లేఖరాశారు. లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్‌ సొమ్మును పంపిణీ చేయా లని కోరారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి సచివాలయ సిబ్బందినే లబ్ధిదారుల ఇళ్లకు పంపించి పింఛన్లను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు మంగళవారం ఉదయం రావచ్చని డీఆర్‌డీఏ, వైకేపీ అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 2,94,888 పింఛన్లు ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు జిల్లాకు రూ.88.22 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులు ఇంకా రాలేదు. ప్రభుత్వం మూడో తేదీనే బ్యాంకులకు నిధులను జమ చేయనుంది. వాటిని సచివాలయ సిబ్బంది డ్రా చేసుకుని వచ్చి పంపిణీ చేయాలి. ఆ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వం మూడో తేదీన బ్యాంకులకు జమచేస్తేనే ఆ సొమ్మును పింఛన్ల పంపిణీకి డ్రాచేసుకునే వీలుంటుంది. నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగితే మూడో తేదీన, లేదా నాలుగో తేదీన కూడా పంపిణీకి అవకాశం ఉండదని అంటున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Volunteers: వాలంటీర్ల సంచలన నిర్ణయం... సామూహిక రాజీనామాలు

ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న వాలంటీర్ల అంశం

వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఈసీ

వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు

cr-20240401tn660a9719ac386.jpg

ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో అధికార, విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో వందలాది వాలంటీర్లు తమ రాజీనామాలను మునిసిపల్ కమిషనర్ కు సమర్పించారు. వాలంటీర్లు సామూహికంగా తరలిరావడంతో మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్ లో భారీ కోలాహలం నెలకొంది. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తూ కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తాము రాజీనామా చేస్తున్నట్టు వాలంటీర్లు పేర్కొన్నారు. 

పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. భీమవరం ప్రాంతంలోనూ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: పేదలకు పింఛన్లు ఇప్పించే వరకు టీడీపీ నేతలు వదలొద్దు: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఈసీ

టీడీపీ పేదలకు పెన్షన్లు అందకుండా చేసిందన్న వైసీపీ

వైసీపీ కుట్ర పూరితంగానే పెన్షన్లు ఆలస్యం చేస్తోందంటున్న టీడీపీ

జగన్ తన స్వార్థ్యంతో పింఛనుదారుల పొట్టకొట్టాడన్న చంద్రబాబు

cr-20240401tn660a8ae88ef4e.jpg

ఎన్నికల కోడ్ ప్రభావంతో ఏపీలో పెన్షన్ల అందజేత ఆలస్యం అయింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణం.

పేదలకు పెన్షన్లు అందకుండా చేసింది టీడీపీ నేతలే అని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఈసీ ఆదేశాల గురించి తెలిసి కూడా పెన్షన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వైసీపీ కావాలనే ఆలస్యం చేస్తోందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు ఈ మధ్యాహ్నం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తన రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛన్ లబ్ధిదారుల పొట్టకొట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4 వేల పెన్షన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ రెండు నెలలు ఎవరికైనా పెన్షన్ అందకపోతే, తాము వచ్చాక అది కూడా కలిపి ఇస్తామని స్పష్టం చేశారు. 

అధికారం నుంచి దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పింఛన్లు ఇప్పించేంత వరకు టీడీపీ నేతలు వదలొద్దని చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు. జిల్లా కలెక్టర్లను కలిసి పెన్షన్ ఇళ్ల వద్దే అందేలా చూడాలని సూచించారు. 

టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీర్లను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తటస్థంగా పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాలంటీర్లకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ప్రజాక్షేత్రంలో జగన్ ను దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా జగన్ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. గత 15 రోజుల్లో ఎవరికెంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

బాబోయ్‌..మ‌ళ్లీ బాబు పాల‌నా?| Chandrababu For Creating Hurdles for Pension Disbursement | greatandhra

 

Link to comment
Share on other sites

  • 0

Perni Nani | చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నరు.. మండిపడ్డ పేర్ని నాని

Perni Nani | ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Perni-Nani_V_jpg--816x480-4g.webp?sw=172

Perni Nani | ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నడైనా ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చారా? అంటూ నిలదీశారు. చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి టీడీపీ నేతలు, అభ్యర్థులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారని.. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా వెళ్లలేదన్నారు. పెన్షన్లపై ఎన్నడూ లేని ప్రేమ చూపుతున్నారని విమర్శించారు.

అసలు పెన్షన్లను ఆపింది ఎవరంటూ ప్రశ్నించారు. వలంటీర్లు వద్ద బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో ఎన్నికల కమిషన్‌కు టీడీపీ లేఖ రాయించిందని ఆరోపించారు. యెల్లో వాచ్‌ అనే సంస్థ వలంటరీల వ్యవస్థపై కోర్టుకు వెళ్తున్నారని.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రతి పథకాలను పంచి పెట్టారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పేరుతో సహా ఏవైనా పథకాలను పంపిణీ చేస్తే తాము అడ్డుకున్నామా? అంటూ నిలదీశారు. పేదలపై సానుకూల దృక్పథంతో ఉన్న నేత వైఎస్‌ జగన్‌ మాత్రమేనన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నియమించలేదని ఆరోపించారని.. సచివాలయాల్లో ఉద్యోగులను ఎవరు నియమించారని ప్రశ్నించారు.

నాలుగున్నరేళ్ల కిందట డిగ్రీ పూర్తి చేసిన 1.60లక్షల మందిని వలంటీర్లుగా జగన్‌ నియమించారన్నారు. పాపపు నోళ్లతోనే కూటమి నేతలు మళ్లీ ఇప్పుడు సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారా..? లేకపోతే రెండు నెలల పెన్షన్‌ చూసి ఓట్లేస్తారా? అని నాని నిలదీశారు. పసుపు కుంకుమ పంపిణీ చేస్తే జనం పచ్చడి చేశారంటూ తెలుగుదేశంపై సెటైర్లు వేశారు. వృద్ధులు సచివాలయానికి వెళ్లి పెన్షన్‌ తెచ్చుకునే పరిస్థితి ఉందా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వాలంటరీ వ్యవస్థపై బాబు విషం కక్కారని.. అడ్డమైన విమర్శలు చేశారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే బాబుకు ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Sajjala Ramakrishna Reddy: స్వార్థంతో ఏం చేస్తున్నారో కూడా చంద్రబాబుకు తెలియడం లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల

సొంత స్వార్థం తప్ప మరేమీ చూసుకోవడం లేదని వ్యాఖ్య

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని విమర్శ

cr-20240404tn660e7d776ab00.jpg

వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని... ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో అన్నవాళ్లే... ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు ఇవ్వొచ్చు కదా అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో ఒకటో తేదీన 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని... కానీ ఇప్పుడు రెండో రోజుకు 60 శాతం పంపిణీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. పెన్షన్లను స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేదే ఆయన ఆలోచన అని చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని... చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. 

కూటమిలో ఉన్నారు కాబట్టే... పై నుంచి ఒత్తిడి చేయించి అధికారులను బదిలీ చేయించారని సజ్జల విమర్శించారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేయాలని అనుకోవడం లేదని... తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి ఫెయిల్యూర్ లీడర్స్ అని ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Vijayasai Reddy: టీడీపీ నేతల మెంటాల్టీ ఇలాగే ఉంటుంది: విజయసాయిరెడ్డి

టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్న విజయసాయిరెడ్డి

పెన్షన్ల విషయంలో చంద్రబాబు ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపాటు

పెత్తందారుల మనస్తత్వం ఉన్న వారిని ఓడించాలని పిలుపు

cr-20240404tn660e7603f3b79.jpg

ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ... టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాల్టీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ డిలే చేయరని... కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పెత్తందారుల మనస్తత్వం కలిగిన వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని విన్నవించారు.   

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Avinash Reddy: చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి

అవ్వాతాతల పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారన్న అవినాశ్

ఇంటికో ఉద్యోగం అన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శ

రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని ఎద్దేవా

cr-20240404tn660e65cade828.jpg

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. మండుటెండల్లో పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. 

కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. 2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారని... అప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

ఓహో! పెన్షన్ రానిది ఇందుకేనా! Whoa! This explains why the pension is delayed! Singam TV

 

Link to comment
Share on other sites

  • 0

Old Women Sensational Comments On Chandrababu Naidu | YS Jagan Siddham Meeting | Telugu Popular TV

 

Link to comment
Share on other sites

  • 0

AP Public Excellent Comments On Volunteers And Warning To Chandrababu, Pawan Kalyan | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajahmundry: పాపాల చంద్రబాబుకు అవ్వాతాతల హెచ్చరిక | Pensioners Fires On Chandrababu | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Rajahmundry: పాపాల చంద్రబాబుకు అవ్వాతాతల హెచ్చరిక | Pensioners Fires On Chandrababu | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Journalist Jani Analysis On Chandrababu About Volunteers Salaries : PDTV News

🔥

 

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు : Who Is Real Visionary: Chandrababu Or Jagan? greatandhra

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...