Jump to content
  • 0

రికార్డుల్లో చంపేశారు! 60 కోట్ల భూమిని కొట్టేశారు


TELUGU

Question

హైదరాబాద్‌, ఫిబ్రవరి3(ఆంధ్రజ్యోతి): రాజధాని ల్యాండ్‌ మాఫియా కొత్త పుంతలు తొక్కింది. బతికి ఉన్న వ్యక్తి చనిపోయాడని చెప్పి, ఆయనకు నకిలీ వారసుడిని సృష్టించి, అతని నుంచి ఏకంగా 60 కోట్ల రూపాయల విలువైన ఐదెకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జరిగిన ఈ వ్యవహారంలో ఏకంగా హైదరాబాద్‌కు చెందిన జిల్లా రిజిస్ట్రార్‌ భార్య పాత్రధారి కావడం గమనార్హం. ఉన్నతాధికారి కుటుంబం కొనుగోలుదారుల్లో ఉండటంతో శంకర్‌పల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కూడా రియల్టర్‌ మాఫియా సమర్పించిన పత్రాల్లో అనేక తేడాలున్నా కళ్లు మూసుకొని గుడ్డిగా రిజిస్ట్రేషన్‌ చేసేసింది. సామాన్యుడు రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్తే చిన్న తేడా కూడా లేకున్నా ఏవేవో అడిగే సబ్‌ రిజిస్ట్రార్‌ తాజా వ్యవహారంలో అనేక తేడాలున్నాయని కనిపిస్తున్నా పట్టించుకోలేదు. కేవైసీలో తేడాలున్నా, అసలు రిజిస్ర్టేషన్‌ చేస్తున్న వ్యక్తే వేరయినా కేవలం ఒక డిక్లరేషన్‌ తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసేశాడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహబూబ్‌నగర్‌ జిల్లా నేత ప్రధాన అనుచరుడు కూడా కొనుగోలుదారుల్లో ఉన్నారు. గత ఆగస్టులోనే పథకం ప్రకారం పాన్‌ కార్డ్‌ సహా కావాల్సిన నకిలీ పత్రాలన్నీ సృష్టించారు. ప్రభుత్వం మారాక కూడా వెరుపు లేకుండా రిజిస్ట్రేషన్‌ కానిచ్చేశారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మరణధ్రువీకరణ పత్రంలో చనిపోయిన వ్యక్తి పేరు ముడగుల వీరవెంకట సత్యనారాయణ అని ఉంది. ఆయన 2014లో చనిపోయాడని పేర్కొన్నారు. 2023లో తీసుకున్న నాలా సర్టిఫికెట్లో భూమి అసలు యజమాని పేరు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ అని ఉంది. అందిన ముడుపులు, ఉన్నతాధికారి భార్య కొనుగోలుదారుల్లో ఉండటం కారణంగా మొత్తం మీద సబ్‌ రిజిస్ట్రార్‌ నోరు మూతపడింది. నిబంధనల ప్రకారం ఆపేయాల్సి ఉన్నా అంతా సవ్యమే అన్నట్లు ప్రక్రియ నడి చిపోయింది. గోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తకు చెందిన రూ.60 కోట్ల విలువైన భూమి వివాదంలో పడిపోయింది.

ఇంటిపేరు ముళ్లపూడి.

ఈ భూమి నిజానికి ఎస్‌ఆర్‌ఎంటీ డైరెక్టర్‌ ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణది. ఆయన పూర్తి పేరుతో కాకుండా ఎంవీవీ సత్యనారాయణ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం దొంగ రిజిస్ట్రేషన్‌కు తావిచ్చింది. ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ 2006లో మరో అయిదుగురితో కలిసి ప్రొగ్రెసివ్‌ ఆగ్రో సర్వీసెస్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, శంకరపల్లిలోని సర్వే నంబరు 334, 335లో 5.12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. యజమాని బల్జీత్‌ కౌర్‌కు డీడీ రూపంలో కెనరా బ్యాంకు నుంచి తమ కంపెనీ తరఫున 18-1-2006న రూ.14,93,285 చెల్లించారు. సంస్థ డైరెక్టర్‌గా సదరు భూమిని 2008లో తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇటీవల శంకర్‌పల్లిలో విల్లాలకు డిమాండ్‌ పెరగడంతో 2023లో ఆయన ఓ సంస్థతో డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. ఈ భూమి మీద కన్నేసిన కొందరు స్కామ్‌కు తెరలేపారు. ఎంవీవీ సత్యనారాయణరావు అనే పేరు ఉన్న వ్యక్తిని తెర మీదకు తెచ్చారు. పూర్తి పేరు ముడగుల వీర వెంకట సత్యనారాయణ. తను 2014లోనే చనిపోయాడని డెత్‌ సర్టిఫికెట్‌ సంపాదించారు. ఆయన వారసుడిగా ఎం.వరప్రసాద్‌ను రంగంలోకి దించారు. వరప్రసాద్‌ నుంచి 2024 జనవరిలో నలుగురు దొంగ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందులో రవీంద్రకుమార్‌, పి.ప్రశాంత్‌తో పాటు మాజీ మంత్రి అనుచరుడు నీలం గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ భార్య హరి రజని కూడా ఉన్నారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చివరి నిమిషంలో ఇబ్బంది రాకుండా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అసలు భూమి యజమాని అయిన ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ మీద నకిలీ అంటూ ఫిర్యాదు చేశారు. నిబంధనలను పాటిస్తే ఈ రిజిస్ట్రేషన్‌ అయ్యేదే కాదు. అసలు ఎంవీవీ సత్యనారాయణ మరణ ధ్రువీకరణ పత్రం సరైందేనా అన్నది సబ్‌ రిజిస్ర్టార్‌ చూసుకోలేదు. వారసుడినంటూ పత్రాలు సమర్పించిన ఎం.వరప్రసాద్‌ ఆధార్‌, ఈ కేవైసీలను చెక్‌ చేసినా బండారం బయట పడేది. నిజానికి సబ్‌ రిజిస్ట్రార్‌ ఎం.వరప్రసాద్‌ ఈ కేవైసీ పరిశీలించారు. ఆధార్‌ కార్డు మీద ఈ కెవైసీ తీస్తే దేవాంగుల వీర వెంకట వర ప్రసాద్‌ అని వచ్చింది. పేరు తేడా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్‌ ఆపేయాలి. ఇక్కడే శంకరపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ వీళ్లకు ప్రాయశ్చిత్తం చూపించారు. ఎం.వరప్రసాద్‌ అన్నా దేవాంగుల వీర వెంకట వర ప్రసాద్‌ అన్నా తానేనని వరప్రసాద్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకుని రిజిస్ట్రేషన్‌ కానిచ్చేశారు. వరప్రసాద్‌ను రంగంలోకి దించిందే హైదరాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కావడంతో చెక్‌లి్‌స్టలేవీ పని చేయలేదు. వ్యక్తి మారినా రూ.60 కోట్ల విలువ చేసే ఆస్తిని బదిలీ చేయడం సంచలనంగా మారింది. అసలు భూమి యజమాని పత్రాలను, నాలా సర్టిఫికెట్‌ను వాడారు. మరణధ్రువీకరణ పత్రానికి వచ్చేసరికి మరో ఎంవీవీ సత్యనారాయణను దించారు. కంపెనీని పోలిన కంపెనీని సృష్టించి, పాన్‌ కార్డు పెట్టి పని కానించారు. ఎంవీవీ సత్యనారాయణ మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉన్న ప్రొగ్రెస్సివ్‌ ఆగ్రో సర్వీసె్‌సను 2005లో కాకినాడలో రిజిస్టర్‌ చేశారు. ఈ సంస్థను తామే స్థాపించినట్లు వరప్రసాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి సర్టిఫికెట్‌ సమర్పించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వివరాలు తెప్పించగా 7-4-2006న పాన్‌కార్డు జనరేట్‌ అయినట్లు ఉంది. వరప్రసాద్‌ ముఠా ఇచ్చిన నకిలీ పాన్‌కార్డు 8-8-2023లో జనరేట్‌ అయింది. మరణ ధ్రువీకరణ పత్రం కాకినాడ నుంచి ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా తేలప్రోలు నుంచి మరోటి తీసుకున్నట్లు సమర్పించారు. ఆ రెండూ నకిలీవని భూ యజమాని ఆర్టీఐ ద్వారా సంపాదించారు.

మరణించాక నాలా ఎలా?

వ్యవసాయేతర భూమి రిజిస్ట్రేషన్‌కు నాలా సర్టిఫికెట్‌ తప్పనిసరి. వరప్రసాద్‌ ముఠా నాలా సర్టిఫికెట్‌ను సమర్పించింది. అసలు ఎంవీవీ సత్యనారాయణ చేయించుకున్న నాలా సర్టిఫికెట్‌ జిరాక్స్‌ తీసి పెట్టారు. మడుగుల వీర వెంకట సత్యనారాయణనాలా సర్టిఫికెట్‌ తీసుకొని ఉంటే 2014 లోపే చేయించి ఉండాలి. వారసుడిగా వరప్రసాద్‌ నాలా చేయించాలంటే భూమి తన పేరిట మారాకే చేయించుకోవాలి. ఇంతా చేసి నాలా సర్టిఫికెట్లో పూర్తి పేరు ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ అని ఉంది. ఇది చూసినా సబ్‌ రిజిస్ట్రార్‌కు అనుమానం రావాలి. రాలేదు.

లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు

...

Read full article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...