Jump to content
  • 0

Chandrababu: నాది విజన్.. జగన్‌ది పాయిజన్


TELUGU

Question

64 రోజుల్లో సైకో పోతాడని.. అందుకు అందరూ సిద్ధమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చింతలపూడి సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనవేనన్నారు.

chandrababu_single_6b697d3102_V_jpg--799

ఏలూరు: 64 రోజుల్లో సైకో పోతాడని.. అందుకు అందరూ సిద్ధమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చింతలపూడి సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనవేనన్నారు. ఒక రాష్ట్ర పెద్ద సీఎం అయితే, ఒక సైకో అయితే, ఒక విధ్వంసకారుడు అయితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జగన్ దిగిపోవడం కాదని.. ప్రజలు ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ దిగిపోతాడని.. కానీ ప్రజల జీవితాలను నాశనం చేశాడని చంద్రబాబు అన్నారు.

జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు..

‘‘12 లక్షల కోట్లు అప్పు చేసావు.. రాష్ట్రాన్ని సర్వం నాశనం చేశాడు. ఆయన అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు. ఆయన ఇంటిలో డబ్బులే డబ్బులు.. ఆ డబ్బులతో ఆయన అకౌంట్లు అన్ని నిండిపోయాయి. 64 వేల కోట్ల రూపాయల మేర కరెంటు ఛార్జీలు పెంచావు. మద్యం అక్రమార్జన కోసం ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలు పెట్టాడు. మద్యం తాగి జనం చచ్చిపోతుంటే, ఈ జలగ మాత్రం మన రక్తం తాగుతూనే ఉన్నాడు. కలియుగంలో మనల్ని మింగేయడానికి ఈ బకాసురుడు పుట్టాడు. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు.. ఆయన చేసిన అప్పు మనమే కట్టాలి. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 5 వేలకు అమ్ముతున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నేనే విభజన చట్టంలో పెట్టించా..

‘‘బటన్ నొక్కా అంటున్న జగన్ రోడ్ల కోసం ఎందుకు బటన్ నొక్కలేదు? రైతులు స్వచ్ఛందంగా 36వేల ఎకరాలు భూములు రాజధానికి ఇచ్చారు. దానికి కులముద్ర వేసి రాజధానిని నాశనం చేశారు. పోలవరం ఏపీకి వరం.. రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు, నేనే విభజన చట్టంలో పెట్టించాను. నెలకొకసారి వచ్చి పోలవరం ప్రాజెక్టును పరిగెత్తించాను. 72 శాతం పనులు పూర్తి చేశాను. పోలవరం పూర్తి చేసే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటుంది. తలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు 4 వేల 900 కోట్లతో చేపడితే.. దాన్ని నిర్వీర్యం చేశారు. పామాయిల్‌కి టీడీపీ సబ్సీడీ ఇస్తే.. జగన్ దాన్ని ఎత్తివేశాడు. పామాయిల్ ధర పడిపోయింది.. అయినా పట్టించుకోడు’’ అని చంద్రబాబు తెలిపారు.

బోత్ ఆర్ నాట్ సేమ్..

‘‘మాటలు చెప్పి, ముద్దులు పెట్టే నాయకుడు వచ్చి మీ జీవితాలు నాశనం చేశాడు. ప్రపంచాన్ని జయించే శక్తి యువతకు ఉంది.. వారికి ప్రోత్సాహం ఇస్తా. ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పేర్ని నాని సర్వర్ వేషం వేసి, మిమ్మల్ని హోటళ్లలో సర్వర్లుగా చేస్తానంటున్నాడు. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి, యువతను పారిశ్రామిక వేత్తలుగా చేయాలనుకుంటున్నాను. రెండూ ఒకటేనా..? బోత్ ఆర్ నాట్ సేమ్. ఏపీలో 90లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వారి శక్తిని టీడీపీ ప్రపంచానికి పరిచయం చేసింది. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 అకౌంట్లో వేస్తా. టీడీపీకి అండగా ఉన్న బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికోసం ఒక ప్రణాళిక రూపొందించి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతాం. ఫించన్లను ఇంకా పెంచుతాం.. మొదటి తేదీన ఇస్తాం. వితంతవులు మూడు నెలల్లో ఎప్పుడు వచ్చినా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

...

Read full article

Link to comment
Share on other sites

0 answers to this question

Recommended Posts

There have been no answers to this question yet

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...