- 0
KCR : టచ్ చేయలేవ్!
-
Similar Content
-
- 0 answers
- 10 views
-
- 0 answers
- 14 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 15 views
-
- 4 answers
- 34 views
-
- 0 answers
- 17 views
-
- 0 answers
- 16 views
-
Soaring Rents in Hyderabad: సామాన్యుడు హైదరాబాద్లో బతకగలడా..? డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెల్సా..?
By Sanjiv,
- 0 answers
- 25 views
-
- 2 answers
- 241 views
-
- 3 answers
- 106 views
-
-
Now Playing
-
A Quiet Place: Day One
-
Le Dernier Jaguar
-
Boneyard
-
Beverly Hills Cop: Axel F
-
Bad Boys: Ride or Die
-
Descendants: The Rise of Red
-
The Garfield Movie
-
Twisters
-
Inside Out 2
-
The Exorcism
-
Deadpool & Wolverine
-
Goyo
-
The Strangers: Chapter 1
-
Justice League: Crisis on Infinite Earths Part Three
-
The Inheritance
-
Despicable Me 4
-
Trigger Warning
-
My Spy The Eternal City
-
Question
TELUGU
‘‘నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు.. నీ కంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా ‘కొత్త సీఎం’ అని సంబోధిస్తూ.. అవగాహన రాహిత్యంతో కొత్త ముఖ్యమంత్రి తనను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న పోరాటంలో భాగంగా నల్లగొండలో ఈనెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై మంగళవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లు తాము పదిలంగా కాపాడుకున్నామని, దానిని పరాయి వాళ్ల పాలుచేస్తున్నారని ఆయన ఆరోపించినట్లు తెలిసింది. ‘‘కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదు. అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొంది. సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు చేసి మరీ తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ తెలంగాణ సాగునీటి హక్కులపై గొడ్డలిపెట్టులా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజలు సాగు, తాగునీరు అందక మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని, వాస్తవ విషయాలను ప్రజలకు వివరించి.. చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టులను తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనను బెదిరించారని కేసీఆర్ వెల్లడించారు. ‘‘కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. తెలంగాణకు అన్యాయం చేస్తామంటే అసలే ఒప్పుకోను. ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదు’’ అని తాను ఆనాడే తేల్చి చెప్పానని వివరించారు.
ఈ కేసీఆర్ వెనక్కిపోడు
‘‘కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకోవడంపైనే ఇక మన పోరాటం. నల్లగొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం. తెలంగాణ కోసం ఈ కేసీఆర్ ఏనాడూ వెనక్కిపోడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని, దీన్ని వ్యతిరేకిస్తూ.. కృష్ణా జలాల వాటా సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే ఇప్పుడు మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని అన్నారు. దీనిని మరో ప్రజా ఉద్యమంగా జనంలోకి తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకే నల్లగొండ సభ నిర్వహిస్తున్నామని, ఇది జరగకుండా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. సభ జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. సభకు ఆ జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో సందడి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా మంగళవారం తెలంగాణ భవన్కు వచ్చారు.
...
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.