Jump to content
  • 2

Chandrababu Praja Galam: టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం


TELUGU

Question

Chandrababu: నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్

జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత

జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

cr-20240329tn6606b615205a5.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు... నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

"ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు... తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Chandrababu: వచ్చేది తుపాను... ఫ్యాన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం: కావలిలో చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రజాగళం ఎన్నికల ప్రచారం

కావలి సభలో చంద్రబాబు వాడీవేడి ప్రసంగం

ఎన్డీయే కూటమి గెలుపు ఖాయం అని చంద్రబాబు ధీమా

వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అని ఎద్దేవా

ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యలు

cr-20240329tn6606ab0b085fd.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. 

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్... టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు. 

"కానీ ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాగళం పేరిట ఇక్కడికి వచ్చాను. ప్రజలు గళం విప్పాలని చెప్పడానికి వచ్చాను. రైతులు పరిస్థితులు బాగున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? ఈ దుర్మార్గుడు తన పాలనలో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు, మీ రక్తాన్ని జలగ మాదిరిగా తాగేస్తున్నాడు. 

అన్ని ధరలు పెంచేశారు, చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. ప్రజల ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చాను. 

ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోంది. ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుంది. చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుంది. 

45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే. నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని నేను ఊహించలేదు. జగన్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, చట్టంపై గౌరవం లేదు, వ్యవస్థలపై విశ్వాసం లేదు. అతడికి తెలిసిందల్లా దోపిడీ, దోచుకున్న డబ్బుతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్ లు కట్టుకోవడం, మీడియా, వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్ లను మనపై పురికొల్పడం. 

జగన్ ను ఎవరూ అడగకూడదు... అతడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు... ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేశాడు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నేతలు.. అందరినీ అణగదొక్కాడు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చి పోరాడగలిగారా? 

ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు, ఆ తర్వాత సీబీసీఐడీ వాళ్లు వస్తారు... అరెస్ట్ చేస్తారు... జైల్లో పెడతారు... ఈ పోలీసుల్లో కొంతమంది జైల్లో కొడతారు, టార్చర్ పెడతారు... చంపేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కేసులు పెట్టి వేధించారు. వీళ్ల దాష్టీకాలకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. 

ఇక బాబాయ్ ని చంపారు. బాబాయ్ ది గొడ్డలివేటా, లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత మీకు రక్షణ ఉందా అని ప్రజలను అడుగుతున్నా. ప్రజల ఆస్తులకు రక్షణ ఉందా? కృష్ణపట్నం పోర్టు ఏమైందో చూశాం. 

ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కొత్త వేషం వేసుకుని వచ్చాడు. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే మేము సిద్ధం అంటున్నాడు. 

నేను పేదల మనిషిని, మిగతా అందరూ పెత్తందార్లు అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఈ ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. పేదల కోసం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినవాళ్లు పెత్తందార్లా? లేక, అధికార దాహంతో అన్న క్యాంటీన్లను రద్దు చేసినవాళ్లు పెత్లందార్లా? 

మన పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా డబ్బులు ఇచ్చాను. మేం పెత్తందారులమా, లేక విదేశీ విద్య పథకం నిలిపివేసినవాళ్లు పెత్తందార్లా? ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని, 12 లక్షల టిడ్కో ఇళ్లు తీసుకువస్తే, ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్లు మీరు పెత్తందార్లు కాదా? 

మేం ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ ఇతడు రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ సందర్భంగా చెబుతున్నా... ఇప్పటివరకు ఇచ్చిన ఇంటి కాలనీలు రద్దు చేయం. ఇంకా డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తాను. నేను సైకో జగన్ లాంటి వాడ్ని కాను. 

ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం...  వాటిని రద్దు చేశాడు. ఆ పథకాలు ఇచ్చిన మేం పెత్తందారులమా? ఆ 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం... ఇప్పుడీ ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేశారు. ఇప్పుడు చెప్పండి... మేం పెత్తందారులమా? ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసిన జగన్ పెత్తందారుడా?

ప్రజలందరి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, జగన్ ఆదాయాలు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది, ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. జగన్ మాత్రం విలాసవంతమైన ఇళ్లు కట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్నాడు. అందుకే ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నా... ప్రజలారా సిద్ధం కండి. జగన్... నిన్ను, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్

బనగానపల్లెలో చంద్రబాబు ప్రజాగళం సభ

సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న చంద్రబాబు

రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని మండిపాటు

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మూడు పార్టీలు కలిశాయని వ్యాఖ్య

నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన

cr-20240329tn6606719d8e012.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లెలో చంద్రబాబు ప్రచారం కొనసాగుతోంది. బనగానపల్లెకు హెలికాప్టర్ లో చేరుకున్న బాబుకు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రాబు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పేదలకు రూ. 2కే బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు. నదులను అనుసంధానం చేయాలనే బాధ్యతను తీసుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. 

ఏపీకి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేశామని చెప్పారు. జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... అప్పులు పుట్టకపోతే పథకాలు ఉండవని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని దుయ్యబట్టారు. దుర్మార్గుడు జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. ఫ్యాన్ ను చెత్తకుప్పలో వేయకపోతే మనకు భవిష్యత్తు లేదని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తామని చెప్పారు.

నాసిరకం మద్యంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారని.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 12 వేల కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించానని.. జగన్ ఖర్చు చేసింది రూ. 2 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. జగన్ 102 ప్రాజెక్టులను రద్దు చేశారని మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసం చేశారని... ఉద్యాగాలను ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. సీఎం నివాసానికి వెళ్లిన కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారని... ఆ కంటెయినర్ లో ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ కోడికత్తి డ్రామాలు ఆడాడని ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan Reddy should answer what he has done for Rayalaseema in last 5 years: N Chandrababu Naidu

jagan-reddy-should-answer-what-he-has-do

Telugu Desam Party (TDP) chief and former chief minister Nara Chandrababu Naidu hit out at Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy and said that the CM should answer what he has done for Rayalaseema, especially for Kadapa, Proddatur, and Pulivendula, despite being the Chief Minister of Andhra Pradesh for 5 years.

At the Proddatur public meeting, Chandrababu Naidu said, “The Yellow Army (TDP) is getting support from all sections in Kadapa. TDP and NDA are unstoppable. The cycle will win in Kadapa as well and no one can stop it.”

He alleged that chief minister YS Jagan Mohan Reddy recently held a meeting in Proddatur, mobilising people from seven constituencies by giving biryani packets and liquor bottles.

“This is the difference between Jagan Reddy’s meetings and our meetings. Police tried hard to make the crowd stay in the meeting by locking the gates and requesting them to sit. But people fled from Jagan Reddy’s meeting. I am challenging Jagan Reddy from Proddatur, which is the heart of Rayalaseema. Jagan Reddy should answer what he has done for Rayalaseema, especially for Kadapa, Proddatur, and Pulivendula, despite being the Chief Minister of Andhra for 5 years,” Naidu said.

He said that if he had been in power, he would have inaugurated the Kadapa steel plant, unlike Jagan Reddy, who laid the foundation stone twice for it.

He further said, “For Jagan Reddy, Rayalaseema means political violence, political killings, capitalist trends, looting natural resources, attacks on people, and filing false cases. For TDP, Rayalaseema means bringing water, constructing projects, industries, drip irrigations, jobs for the youth, providing basic facilities, and making Rayalaseema a hub for horticulture.”

He said that the trend has changed and there is a great change in people’s mindset.
“People of the state will break the YSRCP. Ever since the beginning, Pawan Kalyan said that Jagan Reddy shouldn’t win. Pawan Kalyan is dedicated to the development of the state. He is the first person to come for an alliance to defeat an evildoer like Jagan Reddy,” he said.

He further extended his appreciation for actor and politician Pawan Kalyan during the Proddatur meeting.
“There is Rs 12 lakh crore of debt on Andhra Pradesh. Jagan Reddy doesn’t know how to create and generate wealth and revenue. If the Kadapa Steel plant had been established, thousands would have gotten jobs, and their power of purchase would have been increased. Through this, the government would have gotten revenue. I did the same with KIA motors. I completed the Gollapali project and brought Kia Motors, giving jobs to the youth,” he added.

He said that while he brought companies like Kia Motors and Jockey, companies like Jockey and Amar Raja have left the state because of Jagan Reddy’s harassment.

“Jagan Reddy doesn’t know the value of water and irrigation projects. Jagan Reddy knows nothing but acts like he knows everything. By doing land acquisition and completing the Gandikota project, TDP gave water to Pulivendula. Jagan Reddy is inefficient and couldn’t complete 5 percent of Handri Neeva and provide water to Kuppam,” he further said.

He alleged that Jagan Reddy spent thousands of crores on advertisements for Sakshi paper and for the salaries of his advisors, whereas he spent only Rs 2,000 crores on projects in Rayalaseema.

“NTR’s dream was to bring Krishna water to Rayalaseema. My dream is to complete Polavaram and bring Godavari water to Rayalaseema. If I had stayed in power, the Godavari water would have been supplied to Banakacherla, and Rayalaseema,” he added.

He assured the people that he would make Rayalaseema the Rathnalaseema. “With a 90 percent subsidy, we gave drip irrigation connections to 10 lakh acres. We provided agricultural tools and tractors worth Rs 4,000 crore,” he said.
He said that if Telugu Desam Party comes to power, then in the first 100 days, he will make sure that there won’t be a person who sells Ganja in the state.

“Along with Ganja, the state received 25,000 kilos of drugs from Vizag. If I were the CM, I would have jailed both importers and exporters of these drugs,” he added.

He claimed that due to Jagan Reddy, the Telugu nation is being destroyed.
“The youth who learned IT and went across the world under Jagan Reddy’s administration are getting addicted to J brands, Ganja, and drugs. By giving Rs 10 and publicising it with Rs 30 on Sakshi, Jagan Reddy is looting Rs 100 from the people,” Naidu alleged.

He said that he will lead the state towards a golden era, unlike Jagan Reddy’s stone era.
“I am asking Jagan Reddy, who killed Babai (YS Vivekananda Reddy). I am asking Jagan Reddy didn’t he give the MP ticket to the accused in the murder case? Jagan Reddy should seek the votes from the people only after answering this,” he said.

Naidu further said that due to the foundation laid by him, Hyderabad has become the No. 1 city in the world. “TDP worked for women in the state by implementing several schemes for them. Through Thalliki Vandhanam, we will provide Rs. 15,000 per year to every school-going student. Under the Deepam Scheme, three free gas cylinders will be provided per year. The women will receive Rs. 1,500 per month through Aadabidda Nidhi. Women will also get free travel on the RTC buses,” he said.

He said that through the Annadata scheme, the TDP will give Rs 20,000 to farmers every year. “By giving subsidies, drip irrigation, support prices, and all kinds of support, we will help the farmers in the state. After coming to power, we will provide 20 lakh jobs for the youth in 5 years. Until they get jobs, they will be provided an unemployment allowance of Rs 3000 every month,” he said.

He asserted that after coming to power, he would implement District Selection Committee to provide employment.
“I will implement the Mega (District Selection Committee) DSC after coming to power. As the CM, I conducted 8 DSCs in the United Andhra Pradesh, while NTR conducted 3 DSCs. But Jagan Reddy failed to conduct at least one DSC. I will release a job calendar every year and provide employment to the youth,” he added

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu Naidu: ఈసారి జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఓడించ‌డం ఖాయం.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్‌సీ: చంద్ర‌బాబు

శ్రీకాళ‌హ‌స్తి ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగం

ఛార్జీలు పెంచ‌కుండా కోత‌లు లేని విద్యుత్ ఇచ్చామ‌న్న టీడీపీ అధినేత‌

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఉక్కుపాదం మోపిన‌ట్లు వెల్ల‌డి

రేణిగుంట‌లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశామ‌న్న చంద్ర‌బాబు

నెల్లూరులో ఓ ఎయిర్‌పోర్టు నిర్మించాల‌ని భావించాన‌ని వ్యాఖ్య‌

మ‌న సభ‌లు జ‌నంతో క‌ల‌ల‌.. జ‌గ‌న్ స‌భ‌లు వెల‌వెల అంటూ ఎద్దేవా

cr-20240330tn660823f179b4c.jpg

శ్రీకాళ‌హ‌స్తి ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈసారి జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఓడించ‌డం ఖాయ‌మ‌ని, నిరుద్యోగులు బాధ ప‌డొద్ద‌ని తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్‌సీ ఉంటుంద‌న్నారు. ఛార్జీలు పెంచ‌కుండా కోత‌లు లేని విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశామ‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఉక్కుపాదం మోపిన‌ట్లు పేర్కొన్నారు. రేణిగుంట‌లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. మ‌నం ప‌రిశ్ర‌మ‌లు తెస్తే వైసీపీ నేత‌లు వాటి నుంచి వ‌సూళ్లు మొద‌లుపెట్టార‌ని ఎద్దేవా చేశారు. 

అలాగే రేణిగుంట విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమాశాశ్ర‌యంగా తీర్చిదిద్దామ‌ని చెప్పారు. నెల్లూరులో కూడా ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాల‌నుకున్న‌ట్లు టీడీపీ అధినేత వెల్ల‌డించారు. టీడీపీ కూట‌మి స‌భ‌లు జ‌నంతో క‌ల‌క‌ల‌లాడుతుంటే.. జ‌గ‌న్ స‌భ‌లు వెలవెల బోతున్నాయ‌న్నారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న స్థానిక అభ్య‌ర్థి గోపాల‌కృష్ణా రెడ్డి ప‌ద‌వి ఉంటే ఒదిగి ప‌నిచేసే మంచి మ‌నిషి అని చెప్పారు. ఈసారి జ‌నం ఆలోచించి ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నా చదువు గురించి జగన్ మాట్లాడుతున్నాడు... ఇప్పుడు నేను అడుగుతున్నా!: చంద్రబాబు

నాయుడుపేటలో చంద్రబాబు ప్రజాగళం సభ

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడి

జగన్... ఇంతకీ నువ్వేం చదివావు? అంటూ చంద్రబాబు ఎదురుదాడి

కొత్తగా కంటైనర్ డ్రామాకి తెరలేపారని వ్యాఖ్యలు

cr-20240330tn660803496c4ab.jpg

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుడ్ని చిత్తు చిత్తుగా ఓడించి, ప్యాకప్ చేసి పంపించేయాలని పిలుపునిచ్చారు. 

జగన్ మోహన్ రెడ్డీ... నువ్వేం చదివావు?

నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నేనొక మాట చెప్పా. నా మాదిరిగా రెండు గంటల సేపు ఎండలో నిలుచుని మీటింగ్ చెప్పు... నీ కథేంటో తేలుతుంది అని చెప్పా. నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా... ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివా, 1974లో చదివా, ఆర్థికశాస్త్రంతో చదివా. 

ఇప్పుడు నేను అడుగుతున్నా... జగన్ మోహన్ రెడ్డీ నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? మీకు తెలుసా జగన్ ఏ యూనివర్సిటీలో చదివాడో... దాని పేరు రహస్య యూనివర్సిటీ! ఇలాంటి ఫేక్ ఫెలోస్ నా గురించి మాట్లాడుతున్నారు.

ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు

బాబాయ్ గొడ్డలివేటు చూశారు, కోడికత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. కంటైనర్ పెట్టి ఇంట్లో నుంచి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించారు. గ్రామాల్లో అప్పుడే స్టాక్ పెట్టేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి డబ్బులు పంపించి, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు.

మీ ఆటలు సాగవు... ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికి ఒకరు బయటికి రావాలి, మీ ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలి, ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి, ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని మిమ్మల్నందరినీ కోరుతున్నాను" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: దిక్కుమాలినోడివి... ఐదేళ్లున్నావు... ఏం చేశావు?: నాయుడుపేటలో చంద్రబాబు ఫైర్

తిరుపతి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర

నాయుడుపేటలో భారీ సభ

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు

అందుకే ఇంతమంది జనం వచ్చారని వెల్లడి

జగన్ ఓ బచ్చాగా ఉన్నప్పుడే తాను సీఎంగా ఉన్నానని వ్యాఖ్యలు

cr-20240330tn6607fd540253e.jpg

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాయుడుపేటలో నేడు జనసునామీ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు. 

శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ వెయ్యి తప్పులు చేశాడని, మీరు క్షమిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే, అందరినీ నమ్మించి మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. 

నాయుడుపేట ఎస్సీ నియోజకవర్గం అని, తాను రోడ్డు  మార్గం ద్వారా వస్తుంటే, ప్రజలంతా జెండాలు చేతబూని చంద్రన్నా మీ వెంటే ఉంటాం అని నినదించారని వెల్లడించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా... పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా... పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని పేర్కొన్నారు. 

నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు

ఇప్పుడీ జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా... ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపునిచ్చే పరిస్థితికి వచ్చాడు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు... ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు... ఏమైంది? 

నిన్న అంటున్నాడు... నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు. సైకో జగన్ మోహన్ రెడ్డీ... నీకు తెలియదు. నువ్వు బచ్చాగాడిలా గోలీలాడుకుంటున్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను... మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఓసారి చరిత్ర చూసుకో. 

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 8 పర్యాయాలు డీఎస్సీ పెట్టాం. ఎన్టీఆర్ గారు మూడు సార్లు డీఎస్సీ పెట్టారు. మొత్తమ్మీద టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీ జరిపాం. 

నేనడుగుతున్నా... నువ్వు ఐదేళ్లున్నావు... దిక్కుమాలినోడివి... ఎన్నిసార్లు డీఎస్సీ పెట్టావు? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా? ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తివి... నేను ఇది చేశాను అని చెప్పాలా, లేదా?

జగన్ చేశాడు... ఏం చేశాడంటే... ఐదు వేల జీతంతో వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చాడు! నేను వాలంటీర్లను కోరుతున్నా... మీలో ఎంఏ పాసైన వాళ్లు కూడా ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్లు ఉన్నారు... జగన్ ట్రాప్ లో పడొద్దు. 

మీరు నిర్మొహమాటంగా ఉండండి. తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. వాలంటీర్లను నేను తొలగించనని హామీ ఇస్తున్నా. బాగా చదువుకున్న వాలంటీర్లకు వాళ్ల గ్రామాల్లోనే ఉంటూ రూ.50 వేల వరకు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... మెగా డీఎస్సీ నిర్వహిస్తా. అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.

ప్రజలు గొర్రెలు అనుకుంటున్నాడు... లేకపోతే కోళ్లు అనుకుంటున్నాడు

గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టాడు, బుగ్గలు సవరించాడు. ప్రజలను అమాయకులు అనుకున్నాడు, గొర్రెలు అనుకున్నాడు. లేకపోతే కోళ్లు అనుకున్నాడు... బాగా తిండిపెట్టి కోసుకుని తినొచ్చు అనుకున్నాడు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి. అబద్దాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి. 


ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతు, తాగుబోతు అయితే ఆ కుటుంబం బాగుపడుతుందా? అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడు, అవినీతిపరుడు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. ఆడా మగా, పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని మతాల వారు దెబ్బతిన్నారు.

వీరిద్దరినీ గెలిపించమని అడగడానికి ఇక్కడికి వచ్చాను

ఈసారి సూళ్లూరుపేట నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరినీ గెలిపించమని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. 

కేంద్రంలో  ఎన్డీయే ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, ఈ దుర్మార్గుడు చేసిన నష్టాలను మనం పూడ్చుకోలేం. నేను అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, సర్వేలు చేశాను... పోటీలో ఉన్న వాళ్లందరినీ పరిశీలించిన తర్వాత... పార్టీకి సేవ చేసినవారు, మీకందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవారు అయిన విజయశ్రీని అభ్యర్థిగా ఎంపిక చేశాను. మీ అందరినీ అడిగి ఎంపిక చేశాను కాబట్టి, విజయశ్రీని గెలిపించే బాధ్యత మీది. 

నెల్లూరులో ఎయిర్ పోర్టు వస్తోంది

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం చూస్తే... తిరుపతి ఒకవైపు, నెల్లూరు మరో వైపు, చెన్నై ఇంకోవైపు.. ఇలా మూడు నగరాలు చేరువలో ఉన్నాయి. రెండు ఎయిర్ పోర్టులు దగ్గర్లోనే ఉన్నాయి... నెల్లూరులో మరో ఎయిర్ పోర్టు కట్టుకుంటే, ఈ ప్రాంతానికి మూడు ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉన్నట్టవుతుంది. అదే విధంగా, రెండు పోర్టులు ఉన్నాయి. 

మనకు ఇక్కడ శ్రీసిటీ కూడా ఉంది. తిరుపతి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రపంచంలో అన్ని కంపెనీలను తీసుకువచ్చాను. హీరో మోటార్స్, టీసీఎల్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్... ఇలా  కంపెనీలు తీసుకువచ్చాను. ఇప్పుడీ పరిస్థితి ఉందా? అందుకే జాబు రావాలంటే బాబు రావాలి.

ప్రతి ఒక్కరూ జగన్ చెవిలో పువ్వు పెట్టాలి

నన్ను చూస్తే ఒక కియా మోటార్స్, ఒక హీరో మోటార్స్ వంటి సంస్థలు వస్తాయి. జగన్ ను చూస్తే బూమ్ బూమ్ బ్రాండ్ వస్తుంది. అమరరాజా పరిగెత్తుతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. జగన్ ఉద్దేశంలో మన యువత తెలివి లేనిది. నిరుద్యోగంలో నెంబర్ వన్ అయ్యాం. జగన్ మోహన్ రెడ్డీ... అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావా? ప్రతి ఒక్కరూ ఒక పువ్వు తీసి జగన్ చెవిలో పెట్టి... అతడికి శాశ్వతంగా రాజకీయాలకు విరామం ఇవ్వాలి... అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: నా బ్రాండ్ ఇది... జగన్ బ్రాండ్ అది: ప్రొద్దుటూరులో చంద్రబాబు

కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర

ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో భారీ సభ

ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు

జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని విమర్శలు

ఈయనకు కనీసం శ్రీశైలం ఎక్కడుందో తెలుసా? అంటూ ఎద్దేవా 

cr-20240330tn6607cfdc775fd.jpg

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏంచేశావు? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు అని విమర్శించారు. కానీ తెలుగదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని ఉద్ఘాటించారు. 

కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు

జగన్ కు నీటి విలువ తెలియదని, కనీసం ప్రాజెక్టుల గురించి కూడా తెలియదని విమర్శించారు. శ్రీశైలం ఎక్కడుందో ఈయనకు తెలుసా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజోలిబండ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలియదని, కానీ అన్నీ తెలిసినట్టు నటిస్తుంటాడని వ్యాఖ్యానించారు. 

ఈయన కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అని, అందుకే ఇతడిని కరకట్ట కమలహాసన్ అని పిలుస్తుంటానని వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో గెలిపించిన పులివెందుల ప్రజలు కూడా ఇక జగన్ ను నమ్మరని, ఎందుకు నమ్మరో కూడా చెబుతానని చంద్రబాబు వివరించారు. జనంలో విపరీతమైన మార్పు వచ్చిందని అన్నారు. ట్రెండు మారిందని, ఎన్నికల్లో వైసీపీ బెండు తీయడం ఖాయమని పేర్కొన్నారు. 

పవన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా

ఇవాళ్టి సభలో జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా, పేదలకు న్యాయం జరగడమే ఆశయంగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు, జగన్ ఎలాంటివాడో నేను చిన్నప్పటి నుంచి చూశాను... కరుడుగట్టిన దుర్మార్గుడు ఈ జగన్... అందుకే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పొత్తు పెట్టుకుంటున్నామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనను ఈ ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 

ట్యాంకు నిండుగా ఉంటేనే నీళ్లొస్తాయి

రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ట్యాంకు నిండుగా ఉంటే, కుళాయి తిప్పతే నీళ్లు వస్తాయి, అదే ట్యాంకులో నీళ్లు లేకపోతే, కుళాయి తిప్పినప్పుడు అడుగున ఉన్న ఉన్న బురద వస్తుంది. ఈ దోపిడీదారుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పరిస్థితి తీసుకువచ్చాడు. 

జగన్ కు సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్  వచ్చి ఉంటే కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా వాళ్ల కొనుగోలు శక్తి పెరిగేది. దాంతో, పరోక్షంగా మరింతమందికి ఉపాధి కలిగేది. నేను కియా మోటార్స్ విషయంలో అదే చేశాను. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ కు నేనే ప్రారంభోత్సవం చేశాను. కరవుసీమ అనంతపురంలో తయారైన కియా కార్లు ప్రపంచమంతా పరుగులు తీస్తున్నాయంటే అదీ తెలుగుదేశం పార్టీ విజన్. 

అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ను రాయలసీమకు తీసుకువచ్చాను... అది నా బ్రాండ్. ఓసారి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్లీ శంకుస్థాపన చేయడం జగన్ బ్రాండ్. ప్రజలను మోసం చేయడం, పరిశ్రమలను తరిమివేయడం జగన్ బ్రాండ్. నేను జాకీ పరిశ్రమను తీసుకువస్తే, అది ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కల్పించారు. అమరరాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. కప్పం కట్టలేక, వీళ్ల దౌర్జన్యాలు భరించలేక పరిశ్రమలు పారిపోతే యువతకు ఉద్యోగాలు వస్తాయా? 

ముద్దులు పెట్టాడు... బుగ్గలు నిమిరాడు... మీరు ఐసైపోయారు!

గత ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను, మా చిన్నాన్న ఉండేవాడు, ఆయనను కూడా చంపేశారు అని తలమీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... దాంతో జనాలు ఐసైపోయారు... ఏదో చేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు జనాలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. 

సీమలో 52 సీట్లలో 49 సీట్లలో వైసీపీని గెలిపించారు... ఎప్పుడైనా సరే... సీమలో ఇంత మంది ప్రజలు నాపై నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను? ఎన్ని రోడ్లు వేశాను? ఏం మంచి పనులు చేశాను? అని ఈ జగన్ ఒక్కరోజైనా ఆలోచించాడా? ఎంతసేపటికీ ఏం ఆలోచించాడు... అవినాశ్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలి? ఇదే ఆలోచన తప్ప సీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే నా కల నెరవేరేది

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకువరావాలన్నది నా కల. పోలవరం నీళ్లు రాయలసీమకు వస్తే ఈ ప్రాంతాన్ని కొట్టే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాను. నాగార్జునసాగర్ వరకు నీళ్లు తీసుకురావాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, పట్టిసీమను పూర్తి చేశాను. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచర్ల వచ్చేవి, అప్పుడు రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది... నా జీవితాశయం నెరవేరేది. కానీ ఈ దుర్మార్గుడు వచ్చి మీ గొంతు కోశాడు. ఈ కడప జిల్లాలో ఒక పరిశ్రమ అయినా వచ్చింది, కనీసం పులివెందులో అయినా ఒక్క కంపెనీ అయినా పెట్టారా? 

మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో భావిస్తే... మనకే నష్టం

అతడిపై మీకు ఇంకా కోపం రాలా! మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో, మనవాడు అనో, లేక మన కులం అనో, మన మతం అనో మీరు భావిస్తున్నట్టున్నారు. ఆ భావన మీలో ఇంకా ఉన్నట్టుంది.. ఆ భావన పోకపోతే మనకే నష్టం. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా, పరిశ్రమలను తరిమివేసే వ్యక్తిని మనం క్షమిస్తామా? నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఇక్కడే పుట్టాను... ఇప్పుడే హామీ ఇస్తున్నా... ఈ రాయలసీమను రతనాలసీమగా మార్చుతా... మీ రుణం తీర్చుకుంటా. కులాన్ని చూడొద్దండీ... చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

cbn_4a4a28d9d4_V_jpg--799x414-4g.webp

ఒంగోలు, మార్చి 31: ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (ChandraBabu naidu) ప్రకటించారు. ప్రజాగళం (prajagalam) యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా? మీకు... నిందితుడిని పక్కన పెట్టుకుని వైయస్ జగన్ తిరుగుతోన్నాడని విమర్శించారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావంటూ వైయస్ జగన్‌పై ఈ సందర్బంగా మండిపడ్డారు.

మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడన్నారు. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నలు సంధించారు. అందుకు ప్రతిగా ప్రజలు లేదు లేదంటూ సమాధానం ఇచ్చారు. మూడు పార్టీల నాయకులు కలిసి తొక్కుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు. పార్లమెంట్‌లో ముస్లిం బిల్లులు తీసుకు వస్తే.. జగన్ సపోర్ట్ చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అబ్దుల్ సలాంని వేధించడంతో.. ఆ కుటుంబ సభ్యులంతా ఆత్మాహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఉర్ధుని రెండో భాషగా మార్చింది తానేన్నారు. అలాగే హైదరాబాద్, కర్నూలులో సైతం ఉర్ధు యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ అయిదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా.. చెప్పాలంటూ మార్కాపురం వేదిక మీద నుంచి సీఎం వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు.

ప్రజలు గెలవాలంటే.. కూటమి గెలవాలన్నారు. ఈ రోజు మనం రాతి యుగంలో ఉన్నామని చెప్పారు. తన ప్రయాణం స్వర్ణయుగమని.. తాను ఒక డ్రైవర్‌గా పని చేస్తానని తెలిపారు. తమ బస్సులో ఎక్కిన వాళ్లంతా సురక్షితంగా గమ్యం చేరతారని పేర్కొన్నారు. గతంలో తన పాలన... ప్రస్తుతం జగన్ పాలన చూశారని ప్రజలనుద్దేశించి అన్నారు. మనకి కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదన్నారు. మన కులమని ఓటస్తే కరెంట్ ఛార్జీలు పెంచకుండా మానేశాడా?... అలాగే మన మతం వాడని ఓటేస్తే లిక్కర్ రేట్ తగ్గించాడా?.. మన ప్రాంతం వాడని ఓటేస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడా? అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు ప్రజలకు ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌ని తెలుగు జాతి కోసం తానే అభివృద్ధి చేశానన్నారు. హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు వేశారంటే.. తన పేరే చెబుతారని అన్నారు. జగన్‌ బటన్ నొక్కే కొద్ది ప్రజలకు కష్టాలు పెరుగుతాయని చెప్పారు. తాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తుందా? అని ప్రశ్నించారు. రేపు ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, మరో బటన్ కందుల నారాయణ రెడ్డికి నొక్కండని ప్రజలకు చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఎంపీగా మాగుంటను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపు నిచ్చారు.

మాగుంటకి వైసీపీలో అన్యాయం జరిగిందని.. ఆయన్ని అగౌరవ పరిచి బయటకు వెళ్లేలా చేశారని గుర్తు చేశారు. ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెలకు రూ.1500 ఇస్తామని.. అలాగే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. ఇక ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని... రైతులకు 20 వేలు ఇస్తామన్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతోపాటు 20 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని.. అదే వైయస్ జగన్ అధికారంలో వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు చమత్కరించారు. ప్రతీ నెల రూ. 4 వేల పింఛన్ ఇంటి వద్దనే ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఖజానా ఖాళీ కావడంతో పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీంతో టీడీపీ అడ్డుపడుతుందని తనపై అబండాలు వేస్తున్నాడీ ముఖ్యమంత్రి అంటూ వైయస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే, తమ్ముడు, మామ, బావమర్థి అంతా నియోజక వర్గాన్ని పంచుకుని ఊడ్చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిందే తానని.. అందుకు కేంద్రం సైతం సిద్దంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu Naidu slams YSRCP over ‘forged letter’, says defeat of ruling party in Andhra Pradesh is a foregone conclusion

A document purporting to be a ‘temporary pact’, allegedly signed by the TDP chief, had surfaced on social media

10745_31_3_2024_17_57_25_1_IMG_20240331_

The fan will break into pieces and will be dumped in the dustbin, Telugu Desam Party (TDP) N. Chandrababu Naidu said at a public gathering in Yemmiganur of Kurnool district on Sunday, referring to the YSR Congress Party’s electoral symbol.

Asserting that the defeat of the YSRCP was a foregone conclusion even before the issuance of the election notification, the TDP chief said the massive crowds turning up at his public meetings was an indication of the people’s desire to see the National Democratic Alliance (TDP-BJP-JSP) unseat Y.S. Jagan Mohan Reddy in Andhra Pradesh.

Mr. Naidu said a ‘fake letter’ with his forged signature was circulating on social media, claiming that the TDP’s alliance with the BJP was temporary. “It is the handiwork of the YSRCP leaders, who are misusing technology to defame me. I request people not to fall for these false reports. People are fully aware of Mr. Jagan’s misdeeds,” Mr. Naidu said.

Accusing Mr. Jagan of being a “traitor” to Rayalaseema and cancelling 102 irrigation projects in the region, Mr. Naidu said that under the TDP regime, an amount of ₹68,000 crore had been allocated for irrigation projects in the State of which ₹12,000 crore had been allotted for Rayalaseema. However, the YSRCP government had not spent even ₹2,000 crore in the last five years, he alleged.

The TDP chief claimed that people from Kurnool region were being forced to migrate to other places for employment, and said he would come up with measures to check this trend if voted to power. “A mega textile park will be established in Yemmiganur,” Mr. Naidu said.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
On 3/29/2024 at 9:46 AM, TELUGU said:

Chandrababu: కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్

బనగానపల్లెలో చంద్రబాబు ప్రజాగళం సభ

సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న చంద్రబాబు

రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని మండిపాటు

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మూడు పార్టీలు కలిశాయని వ్యాఖ్య

నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన

vaarni, inka container la deggare aagipoyara yellow pulkas? you've got nothing else??

:emoji-lol:

Link to comment
Share on other sites

  • 0
On 3/30/2024 at 10:04 AM, TELUGU said:

Chandrababu: నా బ్రాండ్ ఇది... జగన్ బ్రాండ్ అది: ప్రొద్దుటూరులో చంద్రబాబు
ముద్దులు పెట్టాడు... బుగ్గలు నిమిరాడు... మీరు ఐసైపోయారు!

గత ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను, మా చిన్నాన్న ఉండేవాడు, ఆయనను కూడా చంపేశారు అని తలమీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... దాంతో జనాలు ఐసైపోయారు... ఏదో చేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు జనాలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. 

 

what goes around comes around

:emoji-lol:

Journalist Jani Full Comedy On Nara Lokesh Yuvagalam | PDTV News

 

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, TELUGU said:

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెలకు రూ.1500 ఇస్తామని.. అలాగే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. ఇక ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని... రైతులకు 20 వేలు ఇస్తామన్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతోపాటు 20 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని.. అదే వైయస్ జగన్ అధికారంలో వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు చమత్కరించారు. ప్రతీ నెల రూ. 4 వేల పింఛన్ ఇంటి వద్దనే ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఖజానా ఖాళీ కావడంతో పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీంతో టీడీపీ అడ్డుపడుతుందని తనపై అబండాలు వేస్తున్నాడీ ముఖ్యమంత్రి అంటూ వైయస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే, తమ్ముడు, మామ, బావమర్థి అంతా నియోజక వర్గాన్ని పంచుకుని ఊడ్చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిందే తానని.. అందుకు కేంద్రం సైతం సిద్దంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

...

Complete article

and where are the funds going to come for all these welfare schemes?? from cbn's pocket?

 

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu : వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇప్పుడు మళ్లీ శవరాజకీయాలు చేస్తూ, ముసలివారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు.

Chandrababu_afe344fe4e_V_jpeg--799x414-4

కొవ్వూరు: సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయాలు చేస్తున్నారని ..ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇప్పుడు మళ్లీ శవరాజకీయాలు చేస్తూ, ముసలివారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు. మొదట కోడి కత్తి డ్రామా, తర్వాత హు కిల్డ్ బాబాయ్ అని సెటైర్లు వేశారు. కొవ్వూరులో ‘ప్రజాగళం’ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సభలకు 1500 బస్సులను పెట్టి ప్రజలకు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సభ ప్రారంభం కాగానే జనం వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాజకీయం మారుతోందని.. జనంలో ట్రెండ్ మారిందని అన్నారు.

ఈ ఎన్నికల్లో జగన్ బెండు తీయడం ఖాయమని దెప్పిపొడిచారు. జగన్‌కు ఇంత అహంకారం పనికిరాదన్నారు. ఆయన అహంకారంతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని చెప్పారు. రాష్ట్రం బాగుకోసం జనంలోకి పవన్ వచ్చారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని గెలిపించాలని కోరారు. తాను ఎండలో ప్రజలు బాగుండాలని వచ్చానని అన్నారు.

వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం ఉందన్నారు. ప్రజలను చంపేసి వారితో శవ రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తన తండ్రిని రిలయన్స్ వారే చంపేశారని జగన్ ఓ సమయంలో అన్నారని.. మళ్లీ వారికే ఎంపీ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేవాడినని చెప్పారు. జగన్ ముక్కుతూ మూలుగుతూ ఏడాదికి రూ. 250 చొప్పున పెంచాడని మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వలంటీర్లు రాజకీయాలు చేయొద్దని సూచించారు. కొంతమంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: సూపర్-6 పథకాలను మరోసారి వివరించిన చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం

కొవ్వూరులో భారీ సభ 

మేనిఫెస్టోలోని ప్రధాన పథకాలను ప్రజలకు వివరించి చెప్పిన చంద్రబాబు

cr-20240404tn660ea879703b0.jpg

కొవ్వూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్-6 పథకాలను వివరించారు. సూపర్-6లో మొదటిది ఆడబిడ్డ నిధి అని వెల్లడించారు. నెలకు రూ.1500 ఇస్తామని, ఇద్దరు మహిళలు ఇంట్లో ఉంటే రూ.3 వేలు, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6,000 ఇస్తామని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం అని మహిళలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ డబ్బుతో మరింత డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తానని తెలిపారు. 

రెండోది... తల్లికి వందనం. ఈ బిడ్డలే మన ఆస్తి అని పేర్కొన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం అని వెల్లడించారు. ఎందుకంటే, జనాభా తగ్గిపోతోందని, జనాభా తగ్గిపోతే రాజ్యం ఉండదని అన్నారు. ఈ పిల్లలను బాగా చదివిస్తే వీళ్లు ప్రపంచాన్ని శాసిస్తారని, అందుకే తల్లికి వందనం పథకం రూపొందించామని చంద్రబాబు చెప్పారు. మూడోది... మేం అధికారంలోకి రాగానే మా ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని వెల్లడించారు. 

నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, చంద్రన్నే మీ డ్రైవర్ అని, నా డ్రైవింగ్ చాలా సేఫ్ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా అడ్డొస్తే చెప్పండి... ఎవరూ మిమ్మల్ని అడగడానికి వీల్లేదు... మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అనడానికి కూడా లేదు అని  స్పష్టం చేశారు. 

ఇక ఐదోది... యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. వర్క్ ఫ్రం హోమ్ విధానం తీసుకువస్తాం... ప్రపంచస్థాయి కంపెనీలను అందుకు అంగీకరింపజేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఆరో పథకం... రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం... రైతులకు సబ్సీడీలు ఇస్తాం, పంట బీమా అందిస్తాం, పంటను కొంటాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: వాలంటీర్ల విషయంలో నాకు ఇదొక్కటే అభ్యంతరం: చంద్రబాబు

కొవ్వూరులో చంద్రబాబు ప్రజాగళం సభ

వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం సరికాదని స్పష్టీకరణ

వాలంటీర్లు తటస్థంగా ఉండాలని హితవు

తాము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న టీడీపీ అధినేత

వాలంటీర్లను తొలగించబోమని హామీ

cr-20240404tn660ea3b250cf2.jpg

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కల్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి పవన్ కల్యాణ్ అని కొనియాడారు. కేంద్రంలో మళ్లీ వచ్చే పార్టీ బీజేపీయేనని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కలిశాయని వెల్లడించారు. ఇక్కడ రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత పురందేశ్వరి పోటీ చేస్తున్నారని, రాజానగరం, నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. 

వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం న్యాయం కాదు

నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో రూ.5 వేల జీతం తీసుకుంటూ, ఒక రాజకీయ పార్టీ అయిన వైసీపీ కోసం పనిచేయడం న్యాయమా అని అడుగుతున్నా... ఈ మాటే నేను అడుగుతున్నా. మేం అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తీసెయ్యం... వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే మీ విధి... ఈ మాటే నేను చెబుతున్నాను. ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతోంది... వాలంటీర్లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు, ఎన్నికలు అయిపోయేవరకు వీళ్లెక్కడా జోక్యం చేసుకోకూడదు, ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది. ఇక అక్కడ్నించి జగన్ శవరాజకీయాలు బయల్దేరాయి. అంటే, పండుటాకుల వంటి ముసలివాళ్లను చంపేయాలని కక్షగట్టాడు. 

జగన్ రెడ్డికి అది అలవాటే!

జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉంది. వాళ్ల వారసత్వమే శవరాజకీయం. ఎవరైనా మంచి పని చేసి, నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ కొందరు మనుషులను చంపేసి, దండేసి, ఎదుటివాళ్లపై ఆరోపణలు చేసి ఓట్లు అడిగే దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. వీళ్ల తండ్రి హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని అన్నాడా, లేదా? రిలయన్స్ షాపులపై దాడి చేశాడా, లేదా? మళ్లీ రిలయన్స్ వారికి ఒక ఎంపీ సీటు ఇచ్చాడా, లేదా? 

తండ్రి లేని బిడ్డను అని చెప్పి 2014లో ఓట్లు అడిగాడు. కానీ ప్రజలు నమ్మలేదు. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడని నమ్మి మాకు ఓటేశారు... అందుకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మళ్లీ శవరాజకీయానికి తెరలేపాడు. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ గొడ్డలివేటు. జగన్ మోహర్ రెడ్డీ... ఇప్పుడైనా చెప్పు... హూ కిల్డ్ బాబాయ్? ఈ దుర్మార్గుడు నారాసుర రక్తచరిత్ర అని దుష్ప్రచారం చేశాడు. ఇప్పుడు వాళ్ల చెల్లెలే చెబుతోంది... రక్తంతో మునిగిపోయిన వైసీపీకి ఓటేయొద్దని అంటోంది. హత్యలు చేసేవాళ్లు, శవరాజకీయాలు చేసేవాళ్లు మీకు కావాలా?

2024 వచ్చింది... మళ్లీ శవాల కోసం వెదుకుతున్నారు

2019 అయిపోయింది... ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాయి. దాంతో మళ్లీ శవాల కోసం వెదుకుతున్నారు. వృద్ధులకు, వితంతువులకు రూ.35తో పెన్షన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రూ.200గా ఉన్న పెన్షన్ ను రూ.2000కి పెంచింది టీడీపీనే. ఈ దుర్మార్గుడు వచ్చి రూ.250 పెంచుకుంటూ పోతానని ఈ ఎన్నికల నాటికి ముక్కుతూ, మూలుగుతూ రూ.3000 చేశాడు. నేను ఉండుంటే మొదట్లోనే రూ.3000 పెన్షన్ ఇచ్చేవాడ్ని. రూ.1000 ఇచ్చి ఇంటింటికీ పోయి లక్ష సార్లు చెప్పాడు. అప్పట్లో రూ.2 వేల పెన్షన్ నేను ఇవ్వలేదంట... ఈయన ఇచ్చాడంట... అబద్ధాల కోరు!

జగన్... నువ్వు దద్దమ్మవి!

మీకు 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు... ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తే రెండ్రోజుల్లో పూర్తవుతుందని చెప్పాను. కానీ సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పడంతో, సచివాలయానికి వచ్చిన వృద్ధుల్లో ఒకరిద్దరు చనిపోయారు. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. జగన్ మోహన్ రెడ్డీ... నీకు పాలించడం చేతకాదు... దద్దమ్మవి నువ్వు. నీకు చేతనైతే  ఎవరినీ చంపకుండా పెన్షన్లు ఇవ్వు... నీకు చేతకాకపోతే పదవి లోంచి దిగిపో... ఒక్క గంటలో ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ ఎందుకు సాధ్యం కాదో నేను చూస్తా... ఇదే నా సవాల్. 

ఆ శవాన్ని తీసుకెళ్లి జగన్ ఇంట్లోనే పూడ్చేవాడ్ని!

జగన్ ఇంకో మాటకు కూడా భయపడిపోయాడు. నువ్వు పెన్షన్ ఇవ్వకపోతే, నేను వచ్చాక మొదటి నెల నుంచే రూ.4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పడంతో భయపడ్డాడు. జగన్ నిన్న డబ్బులు విడుదల చేశాడు. ఇవాళ 80 శాతం మందికి పెన్షన్ ఇచ్చారు... ఈ బుద్ధి ముందేమైంది జగన్ మోహన్ రెడ్డీ? జగన్ ఇంకొక్క రోజు ఆలస్యం చేసుంటే... ఆ శవాన్ని తీసుకెళ్లి నేరుగా వాళ్లింట్లోనే పూడ్చేవాడ్ని... అప్పుడు బుద్ధి వచ్చేది. నువ్వు తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టేది లేదు. శవరాజకీయాలు చేసే ఫ్యాన్ ఆగిపోయింది. తిరగని ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ లాభం లేదు కాబట్టి నీ పార్టీ  గుర్తుగా గొడ్డలి తెచ్చుకో జగన్ మోహన్ రెడ్డీ.." అంటూ చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
7 minutes ago, TELUGU said:

Chandrababu: వాలంటీర్ల విషయంలో నాకు ఇదొక్కటే అభ్యంతరం: చంద్రబాబు
మీకు 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు... ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తే రెండ్రోజుల్లో పూర్తవుతుందని చెప్పాను. కానీ సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పడంతో, సచివాలయానికి వచ్చిన వృద్ధుల్లో ఒకరిద్దరు చనిపోయారు. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. జగన్ మోహన్ రెడ్డీ... నీకు పాలించడం చేతకాదు... దద్దమ్మవి నువ్వు. నీకు చేతనైతే  ఎవరినీ చంపకుండా పెన్షన్లు ఇవ్వు... నీకు చేతకాకపోతే పదవి లోంచి దిగిపో... ఒక్క గంటలో ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ ఎందుకు సాధ్యం కాదో నేను చూస్తా... ఇదే నా సవాల్. 

Not a couple of people but 31 people died on their way to get their pensions! CBN what a manipulator of facts!!

And so, if government employees visit homes to distribute pensions, there won't be any illicit affairs between the women pensioners and the govt employees? How is that an exception? Is that not what CBN and Pawala stated in the past that volunteers are having illicit affairs with (60+ year old) women pensioners when volunteers visit their homes?? What a cheap character out of desperation to mislead the voters and win elections because this is CBN's last chance before he retires (in prison)!

Nakka nee future bokka ! Voters are not idiots and they can see through your manipulations clearly.

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: సీఎం జగన్ పై వ్యాఖ్యలు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో పాల్గొన్న చంద్రబాబు

సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సీఈవోకు వైసీపీ నేతల ఫిర్యాదు

ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు

cr-20240404tn660ed67ca3c3f.jpg

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. 

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: అహంకారంతో విర్రవీగుతున్న కౌరవ మూకను తరిమికొడదాం: చంద్రబాబు

బురఖా తొలగించి మహిళను అవమానించిన వైసీపీ నేత

అదేమని ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి

నందికొట్కూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి తీరుపై టీడీపీ చీఫ్ ధ్వజం

cr-20240406tn6610e8893b764.jpg

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మైనారిటీ మహిళ బురఖాను తొలగించి అవమానించిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. నందికొట్కూరులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ బురఖా తొలగించడాన్ని ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేశారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు కౌరవులుగా మారిపోయారని అన్నారు. ఈ ఘటన వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని చెప్పారు. మత ఆచారాలను గౌరవించని, మహిళల మనోభావాలకు విలువివ్వని ఈ కౌరవ మూకను తరిమి కొడదామని, మే 13న అన్ని వర్గాలు ఏకమై ప్రజాగ్రహం అంటే ఏంటో వైసీపీ నేతలకు చూపించాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

సత్తెనపల్లిలో నేడు ప్రజాగళం..
పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాలోని క్రోసూరు, సత్తెనపల్లిలో శనివారం జరుగుతున్న ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరావాలని చంద్రబాబు కోరారు. మోసపు పునాదులపై జగన్ నిర్మించుకున్న అప్రజాస్వామిక సామ్రాజ్యం మరి కొద్దిరోజుల్లో కూలిపోతుందనే భరోసాను రాష్ట్ర ప్రజలకు కల్పిద్దామని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

...

Complete article

20240406fr6610e83458c00.jpg

Link to comment
Share on other sites

  • 0
25 minutes ago, TELUGU said:

Chandrababu: అహంకారంతో విర్రవీగుతున్న కౌరవ మూకను తరిమికొడదాం: చంద్రబాబు

kaurava mooka na? Jagan okkadni pattukoni kauravulu antadenti?

how about calling kichidi kootami as kauravas??

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: సత్తెనపల్లిలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు... రూ.6 వేల పెన్షన్ ఇస్తామన్న టీడీపీ అధినేత

దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చానన్న చంద్రబాబు

దివ్యాంగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి

దివ్యాంగుల కోసం తెచ్చిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ

cr-20240408tn6613bbff20c9a.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారని వెల్లడించారు. వారి కోరికపై... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇచ్చేందుకు హామీ ఇచ్చానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీయేనని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి, వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని చంద్రబాబు వివరించారు. 

దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

orey babu, itla increase cheskuntoo pote, it shows your utter desperation to win and doesn’t do much for your image to which you have already done more than enough damage! Where is the money going to come from for all your non-viable welfare schemes (SCAMS)?? you will probably cut the number of volunteers into HALF (or more) so you can afford to pay them double (and pocket some of that money for yourself). cheap tactics.

you called these same volunteers as rapists, perverts, laborers, terrorists and even threatened them with prison a few days ago and now you are kissing their asses for votes so you could win and scam money like you always do.

voters are not idiots but you are making a laughing stock and trolling material out of yourself! Obviously age is taking a toll on your sanity.
 

75 year old COPYCAT pedda koduku is making unrealistic promises again with 10,000 “parishotikam”. Babu has only copied Jagan so far.
 

 

Link to comment
Share on other sites

  • 0
3 hours ago, Sanjiv said:

Orey babu, itla increase cheskuntoo pote, it shows your utter desperation to win and doesn’t do much for your image to which you have already done more than enough damage! Where is the money going to come from for all your non-viable welfare schemes (SCAMS)??

You called these same volunteers as rapists, perverts, laborers, terrorists and even threatened them with prison a few days ago and now you are kissing their asses for votes so you could win and scam money like you always do.

Voters are not idiots but you are making a laughing stock and trolling material out of yourself! Obviously age is taking a toll on your sanity.
 

75 year old COPYCAT pedda koduku is making unrealistic promises again with 10,000 “parishotikam”. Babu has only copied Jagan
 

 

 

Debate On Chandrababu Ugadi Lie | Chandrababu U Turn With Volunteer Power|AP Elections 2024@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

Visakha Resigned Volunteer Satires On Chandrababu Ugadi Lie | Big Question | @SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

MLA Perni Nani comments on TDP chief Chandrababu Naidu | AP Volunteers || Samayam Telugu

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...