Jump to content
  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Chandrababu manifesto: ఇదే మా పూర్తి మేనిఫెస్టో: చంద్రబాబు

30-04-2024 Tue 17:35 | Andhra

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు

ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్

మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

cr-20240430tn6630de9217c35.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు అందించడం తెలిసిన నేతలు కూటమిలో ఉన్నారని వెల్లడించారు. కమిట్ మెంట్ లేని రాజకీయాల వల్ల ఏపీ నాశనమైందని, అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ప్రజల ఆస్తి ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమగ్రంగా ఆలోచించి రూపొందించిన మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చాం... కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి  చేశారు.

...

Complete article

20240430fr6630dda0340ca.jpg

20240430fr6630ddab3afd7.jpg

20240430fr6630ddb4d7103.jpg

20240430fr6630ddce61eed.jpg

20240430fr6630ddd9657b3.jpg

20240430fr6630dde6bbdf2.jpg

 

Link to comment
Share on other sites

  • 0

Narendra Modi on taxes in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ తెచ్చింది... ఢిల్లీలో గెలిస్తే 55 శాతం మీ సంపదను లాక్కుంటుంది: మోదీ హెచ్చరిక

30-04-2024 Tue 17:28 | Telangana

తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతోందన్న ప్రధాని

ఈ డబుల్ ఆర్ అంటే తెలుసునని వ్యాఖ్య

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సగం సంపదను తీసుకుంటుందని విమర్శ

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్న ప్రధాని మోదీ

లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలిందని వ్యాఖ్య

cr-20240430tn6630dcd34a9b3.jpg

తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ ఆర్ పన్నును కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ మళ్లీ పాతరోజులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం పూర్తి అవినీతిమయమైందని ఆరోపించారు.

ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుంది

డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరుతోందని, ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ పైన విస్తృత చర్చ సాగుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్‌తో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి ట్యాక్స్ వేస్తున్న కాంగ్రెస్‌కు మనం షాక్ ఇవ్వకుంటే రానున్న అయిదేళ్లు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని విమర్శించారు. 

కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వ పన్ను వేస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వ సంపదపై పన్నును తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు మన సంపాదనలో 55 శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వానికి పోతుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదన్నారు. మేం అధికారంలోకి వస్తే మీ సంపదలో 55 శాతం వాటాను లాక్కుంటామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లలో దోచుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై పదేపదే మాట్లాడిందని, ఇప్పుడు మాత్రం ఆ అవినీతి ఫైళ్లను తొక్కి పెట్టిందని ఆరోపించారు.

లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలింది

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకు పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కాం బయటపడ్డాక ఇద్దరూ తోడుదొంగలు అని తేలిందన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రూ.500 పంట బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు పేదలను పేదలుగానే ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళాశక్తి కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. కేంద్రం నిర్మించే పక్కా ఇళ్లను కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు. 

బీజేపీ పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని అవినీతి ఊబిలో నెట్టిందన్నారు. కాంగ్రెస్ అబద్దాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, మాఫియా, కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పంచసూత్రాలు ఇవేనని ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Nara Brahmani: మంగళగిరిలో లోకేశ్ విజయం విషయంలో ఎలాంటి సందేహం లేదు: నారా బ్రాహ్మణి

30-04-2024 Tue 16:51 | Andhra

మంగళగిరిలో నేడు కూడా కొనసాగిన నారా బ్రాహ్మణి పర్యటన

లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం 

వివిధ వర్గాల వారితో భేటీలు

cr-20240430tn6630d44c69bf7.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి గత కొన్ని రోజులుగా మంగళగిరిలో మకాం వేశారు. తన భర్త నారా లోకేశ్ తరఫున మంగళగిరి ఓటర్లను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నారా బ్రాహ్మణి ఇవాళ కూడా వివిధ వర్గాల వారిని కలిశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా స్పందించారు. 

"మంగళగిరి నియోజకవర్గంలో మావారు నారా లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాను. స్వర్ణకారులు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకున్నాను. లోకేశ్ గారి విజయంలో ఎలాంటి సందేహం లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, మంగళగిరి గోల్డెన్ హబ్ గా మారడం ఖాయమని వారికి భరోసా ఇచ్చాను. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యాపారాలు, వృత్తులు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో చూశాను. 

మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న లోకేశ్ గారికి మద్దతు ఇవ్వాలని కోరాను. విజయ పచ్చళ్ల కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడాను. పట్టణంలో వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను" అంటూ నారా బ్రాహ్మణి వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

TDP Kootami Manifesto: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... వివరాలు ఇవిగో!

30-04-2024 Tue 16:04 | Andhra

చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం

హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్

cr-20240430tn6630c92536bf1.jpg

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు...
 

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500.... 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు

తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం'

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

 

రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి

యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు

మెగా డీఎస్సీపై తొలి సంతకం

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ... నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

 

తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం

బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన... దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు

బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు... ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత

యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం... అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం

గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు

 

చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం... వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం

గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్... రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు

రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం... 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 

ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్

 

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం

జీవో.217 రద్దు 

మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం

చిన్న స్థాయి పోర్టులకు చేయూత

స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు

చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు

వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ

 

ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు

అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా

ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు... ఏవియేటర్లపై సబ్సిడీలు

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం

విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్

కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 

రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన

 

చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు... అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం

ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం... పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన

భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన

 

యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం

ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు

అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత

ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 

మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు... కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు... వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక

 

ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు... పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు... దశల వారీగా బకాయిల చెల్లింపు

ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు

సీపీఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి 

తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్  సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు

వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు

కాపు సంక్షేమం కోసం రూ.15 వేల కోట్ల వ్యయం

ఈబీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యత... ఐదేళ్లకు ఓసారి సమీక్ష... ఆర్థిక సర్వే నిర్వహణ

కాపు యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత... ప్రత్యేక భవనాల నిర్మాణం

ఆర్యవైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు

 

రూ.4 వేల పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ

దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు... పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు

కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్

పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం... గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం 

ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణం... ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోట ఇంటి నిర్మాణం

ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ వెంటనే టిడ్కో ఇళ్ల మంజూరు

 

ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు... జిల్లాల వారీగా వర్గీకరణ

ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు

జీవో నెం.3 పునరుద్ధరణ... ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం 

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

 

ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు... ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు

విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం

నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

ఇమామ్, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనాలు

అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం

మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం 

హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం

 

క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు

క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు

చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థికసాయం

క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సాయం

 

రైతులకు 9 గంటలు అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ

వ్యవసాయ పనిముట్ల కొనుగోలకు సబ్సిడీ

సోలార్ పంపు సెట్లకు రాయితీ... మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు

 

ప్రతి కుటుంబానికి రూ.25 ఆరోగ్య లక్షల బీమా... ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

చంద్రన్న బీమా పథకం... సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా

విద్యుత్ చార్జీల తగ్గింపు

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి

రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

 

బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం 

జీవో నెం.21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గింపు

అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు

భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ

 

మద్యం ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరల  నియంత్రణకు చర్యలు 

ఉచిత ఇసుక విధానం అమలు

రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెం.117 రద్దు

డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Mudragada Padmanabham on defeating Pawan: పవన్ ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా: ముద్రగడ చాలెంజ్

30-04-2024 Tue 11:25 | Andhra

రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరన్న ముద్రగడ

ఎవరికైనా కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని విమర్శ

పవన్ టికెట్లు అమ్ముకున్నారని అంటున్నారని వ్యాఖ్య

cr-20240430tn663087e36c307.jpg

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని... ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని... మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరినీ దగ్గరకు రానివ్వరని... కనీసం తన వద్ద పనిచేసే డైరెక్టర్లకైనా కప్పు కాఫీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

వాళ్ల ఇంట్లో పది మంది ఉన్నారని... ఎవరి బర్త్ డే వచ్చినా వాళ్లింటికి కేకుతో పాటు, భోజనాలన్నీ ప్రొడ్యూసర్లు పంపించాలంట అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేక్ నుంచి ఫుడ్ వరకు నిర్మాతే భరించాలట అని అన్నారు. కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని... ఆయనకు డబ్బే ప్రాణమని చెప్పారు. ఇతరులను గౌరవించే గుణం తనకు ఉందని అన్నారు. 

కష్టమొస్తే మాట్లాడటానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా? అని పవన్ ను ముద్రగడ ప్రశ్నించారు. ఎవరినీ ప్రేమించరు, ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. పవన్ ను నమ్ముకుని నాశనమయ్యామని ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని చెప్పారు. రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెపుతున్నారని... ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్లు కూడా అమ్ముకున్నారని అంటున్నారని చెప్పారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే... రాజకీయాల్లో ఆదాయమే ఎక్కువని మీ సన్నిహితులే చెపుతున్నారని అన్నారు. పవన్ ఎవరికీ పెట్టరని, పెట్టమని చెప్పినా ఆయనకు నచ్చదని ఎద్దేవా చేశారు. తనను ఉప్మా, కాఫీ అనడానికి సిగ్గులేదూ? అని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on Sharmila, Revanth and Chandrababu: షర్మిల, రేవంత్‌రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే: జగన్

30-04-2024 Tue 10:14 | Both States

వారిద్దరి రిమోట్ చంద్రబాబు వద్ద ఉందన్న జగన్

కడపలో షర్మిల పోటీపై తనకు ఎలాంటి బాధా లేదని స్పష్టీకరణ

కాకపోతే ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనన్నదే తన బాధ అన్న జగన్

అక్రమాస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్‌తో ఆమె కలిసి పనిచేస్తోందంటూ ఆవేదన

ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు

cr-20240430tn6630771171cd2.jpg

తన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కడప లోక్‌సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్‌కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, TELUGU said:

TDP Kootami Manifesto: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... వివరాలు ఇవిగో!

30-04-2024 Tue 16:04 | Andhra

చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం

హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్

cr-20240430tn6630c92536bf1.jpg

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు...
 

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500.... 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు

తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం'

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

 

రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి

యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు

మెగా డీఎస్సీపై తొలి సంతకం

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ... నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

 

తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం

బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన... దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు

బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు... ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత

యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం... అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం

గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు

 

చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం... వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం

గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్... రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు

రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం... 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 

ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్

 

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం

జీవో.217 రద్దు 

మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం

చిన్న స్థాయి పోర్టులకు చేయూత

స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు

చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు

వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ

 

ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు

అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా

ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు... ఏవియేటర్లపై సబ్సిడీలు

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం

విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్

కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 

రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన

 

చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు... అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం

ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం... పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన

భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన

 

యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం

ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు

అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత

ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 

మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు... కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు... వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక

 

ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు... పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు... దశల వారీగా బకాయిల చెల్లింపు

ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు

సీపీఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి 

తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్  సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు

వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు

కాపు సంక్షేమం కోసం రూ.15 వేల కోట్ల వ్యయం

ఈబీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యత... ఐదేళ్లకు ఓసారి సమీక్ష... ఆర్థిక సర్వే నిర్వహణ

కాపు యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత... ప్రత్యేక భవనాల నిర్మాణం

ఆర్యవైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు

 

రూ.4 వేల పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ

దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు... పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు

కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్

పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం... గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం 

ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణం... ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోట ఇంటి నిర్మాణం

ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ వెంటనే టిడ్కో ఇళ్ల మంజూరు

 

ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు... జిల్లాల వారీగా వర్గీకరణ

ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు

జీవో నెం.3 పునరుద్ధరణ... ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం 

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

 

ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు... ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు

విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం

నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

ఇమామ్, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనాలు

అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం

మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం 

హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం

 

క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు

క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు

చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థికసాయం

క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సాయం

 

రైతులకు 9 గంటలు అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ

వ్యవసాయ పనిముట్ల కొనుగోలకు సబ్సిడీ

సోలార్ పంపు సెట్లకు రాయితీ... మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు

 

ప్రతి కుటుంబానికి రూ.25 ఆరోగ్య లక్షల బీమా... ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

చంద్రన్న బీమా పథకం... సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా

విద్యుత్ చార్జీల తగ్గింపు

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి

రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

 

బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం 

జీవో నెం.21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గింపు

అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు

భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ

 

మద్యం ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరల  నియంత్రణకు చర్యలు 

ఉచిత ఇసుక విధానం అమలు

రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెం.117 రద్దు

డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

...

Complete article

Aa unrealistic long list chustuntene mind dobbutundi chandrababu’s desperation to win but who is going to believe him? Adi chestam, idi chestam, adi istam, idi istam… People have heard enough of these already.

Ninnu Nammam Babu song 🤣

Even BJP is not getting involved in this bogus manifesto and distancing itself from these fake promises to keep themselves safe as they know CBN is going to grossly default on these promises if he comes to power just like he defaulted  it he past!

 

Link to comment
Share on other sites

  • 0

TV9 Mass Trolling On Glass Symbol పగిలేకొద్దీ పదునెక్కే గ్లాస్!!

 

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబు గనక ఈ యాడ్ చూస్తే ఎక్కి ఎక్కి ఏడుస్తాడు బయ్యా!YCP Latest Election ADD | Sri Media Daily

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: I invented Alexa. You can use it to do anything and ask anything and she will tell you! No need to use your phone.

Me: Alexa, what will be situation of CBN after June 4?

Alexa: Katakataala Chandrayya

Why did Alexa did not tell you in 2019 of your humiliating defeat?

మరి 2024లో ఓడిపోతున్నారు అని అలేక్సా చెప్పలేదా నీకు😂😂😂😂

 

:emoji-lol:

https://www.instagram.com/p/C6a-U9LpoLH

Link to comment
Share on other sites

  • 0

Pappu on deleting TDP manifesto from their website

మేనిఫెస్టో డిలీట్ చేసినంతమాత్రాన ప్రజలు దానిని మర్చిపోరు చంద్రబాబు.. 😂

https://www.instagram.com/p/C6WJTlApPTF

Link to comment
Share on other sites

  • 0

Promises made in TDP-BJP-JSP alliance manifesto are realistic, says former Finance Minister Yanamala

‘It aims to achieve double-digit growth and one way to generate adequate revenue is by harnessing the natural resources, especially mines’

11GNRAO-TDP-01%207.JPG

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure will fetch sizeable revenue for the State exchequer, says TDP leader Yanamala Ramakrishnudu | Photo Credit: File photo

Former Finance Minister Yanamala Ramakrishnudu on Wednesday asserted that the TDP-BJP-Jana Sena Party (JSP) manifesto targeted a double-digit economic growth and the promises therein were realistic, unlike those made by YSR Congress Party (YSRCP) president and Chief Minister Y.S. Jagan Mohan Reddy. 

Addressing media persons, Mr. Ramakrishnudu said though the manifesto was widely appreciated there were doubts whether the TDP-BJP-JSP Government would be able to implement it because of the huge debt of ₹14 lakh crore that piled up over the years. One way to generate adequate revenue was by harnessing the natural resources, especially mines, which were exploited to the hilt by private companies. 

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure would fetch sizeable revenue for the State exchequer. The battery of advisors appointed by the YSRCP would be done away with and own-tax revenue would be increased. 

Further, Mr. Ramakrishnudu said efforts would be made to have the 16th Finance Commission grant increased by 50% and that it was quite possible as BJP was a part of the alliance. The average capital expenditure in the last five years was below ₹12,000 crore, which stifled growth and the situation was so pathetic that the YSRCP Government struggled to pay salaries to the employees on time. The manifesto contained a roadmap for strengthening the rural economy and attracting investments, he said. 

The TDP-BJP-JSP government would give due priority to welfare schemes, Mr. Ramakrishnudu added, while alleging that Mr. Jagan was deliberately campaigning that the schemes would be done away with if the NDA alliance replaced the YSRCP.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 minute ago, TELUGU said:

Promises made in TDP-BJP-JSP alliance manifesto are realistic, says former Finance Minister Yanamala

‘It aims to achieve double-digit growth and one way to generate adequate revenue is by harnessing the natural resources, especially mines’

11GNRAO-TDP-01%207.JPG

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure will fetch sizeable revenue for the State exchequer, says TDP leader Yanamala Ramakrishnudu | Photo Credit: File photo

Former Finance Minister Yanamala Ramakrishnudu on Wednesday asserted that the TDP-BJP-Jana Sena Party (JSP) manifesto targeted a double-digit economic growth and the promises therein were realistic, unlike those made by YSR Congress Party (YSRCP) president and Chief Minister Y.S. Jagan Mohan Reddy. 

Addressing media persons, Mr. Ramakrishnudu said though the manifesto was widely appreciated there were doubts whether the TDP-BJP-JSP Government would be able to implement it because of the huge debt of ₹14 lakh crore that piled up over the years. One way to generate adequate revenue was by harnessing the natural resources, especially mines, which were exploited to the hilt by private companies. 

Curbing the irregularities in liquor sales and curtailing wasteful expenditure would fetch sizeable revenue for the State exchequer. The battery of advisors appointed by the YSRCP would be done away with and own-tax revenue would be increased. 

Further, Mr. Ramakrishnudu said efforts would be made to have the 16th Finance Commission grant increased by 50% and that it was quite possible as BJP was a part of the alliance. The average capital expenditure in the last five years was below ₹12,000 crore, which stifled growth and the situation was so pathetic that the YSRCP Government struggled to pay salaries to the employees on time. The manifesto contained a roadmap for strengthening the rural economy and attracting investments, he said. 

The TDP-BJP-JSP government would give due priority to welfare schemes, Mr. Ramakrishnudu added, while alleging that Mr. Jagan was deliberately campaigning that the schemes would be done away with if the NDA alliance replaced the YSRCP.

...

Complete article

there is no kootami manifesto - only tdp and jsp manifesto because nda safely excused themselves to be associated with cbn's bogus manifesto. and so, this manifesto is not even realistic to begin with.

 

Link to comment
Share on other sites

  • 0

KTR | ఇదెక్కడి అరాచకం…? తెలంగాణ కీ ఆవాజ్‌ కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్‌ ఫైర్‌

KTR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఏకంగా తెలంగాణ కీ ఆవాజ్‌ కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ (ఎక్స్‌ ) వేదికగా ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

KTR-7_V_jpg--816x480-4g.webp?sw=1728&dsz

మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు ఫిర్యాదు చేసినా మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దరిద్రపు నోటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇది బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు వణికిపోతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

...

Complete article

ఇదెక్కడి అరాచకం...? ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..? మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints రేవంత్ బూతులు EC కి ప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap Minister of Telangana Revant బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది...! Why are BJP and Congress so shaken by #KCRPoruBaata ? People of Telangana will give a befitting answer to your arrogance & institutional abuse

 

Link to comment
Share on other sites

  • 0

KCR Barred From Campaigning For "Derogatory" Remarks Against Congress

The Congress had complained to the election panel on April 6 about certain "objectionable" remarks issued by KCR at a press meet in Telangana's Sircilla town a day earlier.

The Congress had complained about certain "objectionable" remarks by KCR. (FILE)

New Delhi:

Former Telangana Chief Minister K Chandrashekar Rao, popularly known as KCR, has been was banned by the Election Commission today from campaigning for 48 hours for his "derogatory" statements against the Congress. The 48-hour ban comes into force at 8 pm this evening.

The Bharat Rashtra Samithi (BRS) president has been barred from holding any public meetings, public processions, public rallies, shows and interviews, and public utterances in media in connection with the ongoing election for two days, said the Election Commission, "strongly condemning his impugned statements".

The Congress had complained to the election panel on April 6 about certain "objectionable" remarks issued by KCR at a press meet in Telangana's Sircilla town a day earlier.

The commission had earlier issued a show-cause notice to KCR over the alleged remarks. Responding to the notice on April 23, the former Chief Minister, however, denied the charge. He pointed out that the meaning of his original statement has been lost in translation: "The officers in charge of election in Telangana and Sircilla are not Telugu people and they hardly understand the local dialect of Telugu."

He also accused the Congress of picking some sentences from his press conference out of context. "The English translation of the sentences is not correct and twisted," he said.

KCR insisted that he had confined his criticism to the policies and programmes of the Congress and that he had not gone into personal aspects of any Congress leader as the Election Commission said.

After going through the content of the Congress complaint and KCR's reply, the commission found that the BRS chief "has violated the provisions of the Model Code of Conduct".

Post a commentK Chandrashekar Rao is the second politician to be banned from campaigning for 48 hours after Congress leader Randeep Singh Surjewala in the ongoing Lok Sabha elections.

...

Complete article

KCR News | KCR Barred From Campaigning For "Derogatory" Remarks Against Congress

 

Link to comment
Share on other sites

  • 0

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది.

Poling_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు పోలింగ్‌ సమయాన్ని ఈసీ పెంచింది.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

KTR's challenge: నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

01-05-2024 Wed 16:08 | Telangana

మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్న కేటీఆర్

ఈ మాఫీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే మోదీ మాత్రం పెంచారని విమర్శ

cr-20240501tn66321b9a28025.jpg

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని నిరూపిస్తే తాను రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టారన్నారు. 2014లో మోదీ ప్ర‌ధాని అయ్యే నాటికి ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్లు కాగా, ఇప్పుడు 84 డాల‌ర్లుగా ఉందని, కానీ మన వద్ద చమురు ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో పన్నులు పెంచలేదని, కానీ మోదీ మాత్రం పన్నుల మీద పన్నులు వేసి రూ.30 ల‌క్ష‌ల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ ర‌హ‌దారుల కోసం సెస్ పెట్టామ‌ని కేంద్రం చెబుతోందని... కానీ ప్ర‌తి జాతీయ ర‌హ‌దారిపై టోల్ వ‌సూళ్లు చేస్తున్నారన్నారు. ఒక వైపు టోల్ మరోవైపు సెస్‌లు గుంజుతున్నారన్నారు. రూ.30 ల‌క్ష‌ల కోట్ల గురించి నిల‌దీస్తే వాస్తవం బయటపడిందన్నారు. బ‌డా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీల‌కు మోదీ ప్రభుత్వం ప‌ద్నాలుగున్నర ల‌క్ష‌ల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తానన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

AIMIM support for YSRCP: వైఎస్సార్‌సీపీకి మద్దతివ్వండి: ఏపీ ఓటర్లకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

01-05-2024 Wed 17:01 | Both States

అత్యంత లౌకికవాద నాయకుడు జగన్ అంటూ కితాబు   

ఏపీలో జగన్ ఒక్కరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల పరిరక్షణకు పాటు పడుతున్నారని వ్యాఖ్య

చంద్రబాబు అవకాశవాది అని విమర్శించిన ఒవైసీ

cr-20240501tn6632282e8c1aa.jpg

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను పరిరక్షించేందుకు పాటుపడుతున్న అత్యంత లౌకికవాద నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవకాశవాది అని, విశ్వసనీయత లేని నాయకుడని అన్నారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు వెనుకడుగువేయబోరని అన్నారు. కాగా ఏపీ ఎన్నికలు- 2019లో వైఎస్సార్‌సీపీ పార్టీకి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ మరోసారి ఖండించారు. ముస్లింలే ఎక్కువగా కండోమ్స్ వాడతారని పునరుద్ఘాటించారు. ఇదిలావుంచితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మాధవీ లత ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు. ఒవైసీ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చుతూ ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Posani Krishna Murali: జగన్ ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీ స్పందించలేదు: పోసాని కృష్ణమురళి ఫైర్

01-05-2024 Wed 15:54 | Andhra

జగన్ ను చంపుతానని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారన్న పోసాని

రెండు సీట్ల కోసం చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని ఎద్దేవా

చంద్రబాబు నుంచి జగన్ ను సీజేఐ కాపాడాలని విన్నపం

cr-20240501tn6632185c4ac7b.jpg

జగన్ ను చంపేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించినా బీజేపీకానీ, మేధావులు కానీ స్పందించలేదని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విమర్శించారు. కేవలం రెండు ఎంపీ సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన బీజేపీ... వేల కోట్ల ప్రజాధనాన్ని తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఎన్ని వేల కోట్లయినా తినొచ్చా? అని ప్రశ్నించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని జగన్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ఓడించడం సాధ్యంకాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

IYR Krishna Rao: ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో: 'కూటమి' మేనిఫెస్టోపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్య

01-05-2024 Wed 14:50 | Andhra

ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే ప్రజల్లోకి వెళుతుందన్న ఐవైఆర్

బీజేపీ అంటీముట్టనట్టుగానే ఉందని వెల్లడి

ఒక రకంగా ఇది ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని వివరణ

cr-20240501tn66320940aa417.jpg

నిన్న బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేమని అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అని అభివర్ణించారు. ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందని తెలిపారు. 

ఇది అమలు చేయడానికి సాధ్యం కాని మేనిఫెస్టో అని ఐవైఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాల్లో స్పష్టత లేదని అన్నారు. టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలకు, బీజేపీ విధానాలకు సారూప్యత కుదరడం లేదని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో బీజేపీ జాతీయ విధానం అవలంబిస్తోందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటామన్న వైఖరిని బీజేపీ కనబర్చిందని వివరించారు. 

ఆ మేనిఫెస్టోను ప్రధానంగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే భావిస్తారని ఐవైఆర్ తెలిపారు. ఆ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుంది అనేది పార్టీ మాట అని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...