- 0
Telangana: త్వరలో తెలంగాణలో కుల గణన, వారికి తులం బంగారం: సీఎం రేవంత్ రెడ్డి
-
Similar Content
-
- 124 answers
- 1,297 views
-
- 0 answers
- 5 views
-
- 0 answers
- 10 views
-
- 17 answers
- 2,469 views
-
- 2 answers
- 44 views
-
- 24 answers
- 409 views
-
- 1 answer
- 656 views
-
- 0 answers
- 31 views
-
- 0 answers
- 42 views
-
- 2 answers
- 207 views
-
Question
TELUGU
Caste Census In Telangana: త్వరలోనే తెలంగాణలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు.
Revanth Reddy announces To Conduct caste census Soon: హైదరాబాద్: త్వరలోనే తెలంగాణలో కుల గణన (caste census) చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని, అందుకు తగినట్లు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు (Food Charges), కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు.
మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్ధంగా అమలు చేయాలని నిర్ణయించారు ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
...
Read full article...
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.