Jump to content
  • 3

CM Jagan Bus Yatra: వైసిపి మేమంత సిద్దం ఎన్నికల ప్రచారం


Vijay

Question

Recommended Posts

  • 0

Sajjala Ramakrishna Reddy fires on Chandrababu: మేం ఏం చేయాలో చెప్పడానికి ఈయన ఎవరు?: చంద్రబాబుపై సజ్జల ఫైర్

29-04-2024 Mon 19:33 | Andhra

మే 1న డీబీటీ ద్వారా పెన్షన్ల పంపిణీ

ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటున్న చంద్రబాబు

ఉన్న వ్యవస్థను దెబ్బతీసింది చంద్రబాబేనన్న సజ్జల

ఇప్పుడు కూడా మళ్లీ తయారయ్యాడని విమర్శలు

ఈయనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా అంటూ ఆగ్రహం

cr-20240429tn662fa8cfbb42e.jpg

మే 1న ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. పట్టుబట్టి మరీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగేవారు రావొచ్చని, రాలేనివారికి ఇంటివద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే, అప్పటికే తన మీద వ్యతిరేకత వస్తోందని భయపడిన చంద్రబాబు... 1 లక్ష 20 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారితో ఇంటింటికీ పంపిణీ చేయించొచ్చు కదా అని కొత్త బాణీ అందుకున్నారని సజ్జల ఆరోపించారు. 

ఏదేమైనా జగన్ మోహన్ రెడ్డి పెట్టిన ఉద్యోగులు అని చంద్రబాబు ఒప్పుకున్నాడని వ్యాఖ్యానించారు. "పెన్షన్లు ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని లెక్కలేసి చెబుతున్నాడు... అసలు ఎవరీయన? ఈయనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? ఒకపక్క ఉన్న వ్యవస్థను ఈయనే దెబ్బతీస్తాడు. మళ్లీ ఆ వ్యవస్థ బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా ఈయనే చెబుతాడు. అలా చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడు. 

తనకు ఏం అధికారం ఉందని ప్రతి రోజూ ఎన్నికల సంఘం వద్దకు పంపించడం, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచడం చేస్తున్నాడు? తనకున్న మీడియాలో అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అధికారులపై రాయిస్తున్నాడు. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. సీఎంగా ఉన్నప్పుడు 2019కి ముందు కూడా సీఈవోపై దాడి చేసినంత పనిచేశాడు. హూంకరించాడు, దబాయించాడు... ఇప్పుడూ అదే చేస్తున్నాడు. 

మామూలుగా సాఫీగా జరుగుతున్న వ్యవస్థను ఎవరు బ్రేక్ చేయమన్నారు? అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయంలో అందరూ పనిచేస్తున్నారు. ఆ సిస్టమ్ ను అలాగే వదిలేస్తే రెండు మూడ్రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తవుతుంది. చంద్రబాబు భయం ఏంటంటే... తన వల్లనే వాళ్లు రోడ్డెక్కాల్సి వచ్చింది. సచివాలయాల వరకు పెన్షనర్లు వెళ్లాల్సి వచ్చింది అనేది ఆయన భయం.... వృద్ధులు, అశక్తులు ఆ కోపాన్ని తన మీద చూపిస్తారని ఆయన భయం. 

ఆ భయంతోనే మళ్లీ వరుసబెట్టి పిటిషన్ల మీద  పిటిషన్లు వేయిస్తున్నాడు. అందుకే ఇళ్లకు తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వాల్సిందే... లేకపోతే ఆ 32 మంది నువ్వే చంపినట్టు అవుతుంది అని బెదిరిస్తున్నాడు. శవరాజకీయాలు అంటున్నాడు... శవరాజకీయాలు చేసింది ఎవరు... ఈయనే. ఈ రోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దాన్ని పట్టుకుని మళ్లీ డీబీటీ కాదు, ఇళ్ల వద్దకే ఇవ్వాలంటున్నాడు. 

అంతేకాదు, చంద్రబాబు గ్యాంగు మొత్తం గవర్నర్ ను కలిసి, ఢిల్లీలోనే మకాం పెట్టి పొద్దున లేచినదగ్గర్నుంచి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారు. సీఎస్ చేతిలో సీఈవో ఉన్నాడా... సీఈవో చేతిలో సీఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో రాసి, బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి తీసుకువచ్చి మళ్లీ ఈసీతో ఒక లెటర్ ఇప్పించారు. ఈ క్రమంలో... డీబీటీ లింక్ ఎంతమందికైతే ఉందో, వారికి ఆ విధానంలో పెన్షన్లు ఇస్తాం... లేనివారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తాం... ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పు ఎవరిది ఇందులో? ఎవరిది ఈ పాపం? చంద్రబాబుది కాదా?" అని సజ్జల ధ్వజమెత్తారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Compare Babu’s bogus report and Jagan’s progress report before voting: Jagan Mohan Reddy

Chief Minister and president of YSRCP, YS Jagan Mohan Reddy speaking in a public meeting at Tangutur of Kondapi assembly constituency on Tuesday

1443000-jagan.webp

The chief minister and president of YSR Congress Party, YS Jagan Mohan Reddy advised the public to compare the benefits they received, and the good work Nara Chandrababu Naidu and Jagan Mohan Reddy have done, before they exercise their franchise.

Tangutur: The chief minister and president of YSR Congress Party, YS Jagan Mohan Reddy advised the public to compare the benefits they received, and the good work Nara Chandrababu Naidu and Jagan Mohan Reddy have done, before they exercise their franchise. Jagan Mohan Reddy participated in the Siddham public meeting at Tangutur in the Kondapi assembly constituency, to seek votes in support of Ongole MP candidate Dr Chevireddy Bhaskar Reddy and Kondapi MLA candidate Dr Audipulapu Suresh, on Tuesday.

Speaking at the public meeting, Jagan Mohan Reddy said that the elections are not to choose the MP and MLA, but to decide whether the welfare programs introduced in the YSRCP government to continue or not, and to opt for the future of the poor. He warned that voting for Chandrababu Naidu is nothing but awakening the Chandramukhi, which feasts on the people's blood. He compared his 58-month chief ministership against the 14-year chief ministership of Chandrababu Naidu in providing employment, empowerment of farmers, development activities, and other sectors.

He said that he provided 3.21 lakhs of jobs for youth, input subsidies, 9 hours of quality electricity in the daytime, crop insurance, various services at Raitu Bharosa Kendras for farmers, and claimed to construct 15000 village and ward secretariats, 11000 village and ward clinics, 11000 Raitu Bharosa Kendras, 17 new medical colleges, 4 new seaports, 10 fishing arbours and 6 fish landing centres as part of the development. He said that he brought surface water to address the Uddanam crisis, water through the Veligonda project for the Prakasam district, extending airports, sped up works of Bhogapuram airport, 3 industrial corridors, 10 industrial nodes, and supporting MSMEs and self-employment opportunities through various programs.

Jagan Mohan Reddy said that in his rule, many families can break their shackles of poverty, and students from poor families are receiving the opportunity to study in English Medium, in advanced classrooms, and being trained for TOEFL from 3rd class, and have content support from Byju’s in Tabs. He said that with the fee reimbursement, Jagananna Vidya Deevena and Jagananna Vasati Deevena programs, the students are able to attend courses in foreign universities also.

The chief minister alleged that Chandrababu Naidu is trying to accuse him of the failure in the distribution of pensions in time, and suffering the beneficiaries subjected to. He said that he provided economic, educational, social, political and gender empowerment to the women by bringing revolutionary programs. He said that he transferred Rs 2.70 lakh crores into the accounts of the beneficiaries under various schemes by pressing the buttons. He said that Chandrababu Naidu failed to implement a waiver of agriculture loans, bring special category status and other promises made in the Manifesto 2014, drafted with the BJP and Janasena parties. He warned the public to believe the same parties joined hands against him and asked them to vote for YSRCP to continue the welfare programs and development.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on Avinash: ఇంత మంచి మనసున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు: మైదుకూరులో సీఎం జగన్

30-04-2024 Tue 17:19 | Andhra

అవినాశ్ రెడ్డిపై సీఎం జగన్ పొగడ్తలు

యువకుడు, ఉత్సాహవంతుడు అంటూ కితాబు

మీ చల్లని దీవెనలు నా తమ్ముడిపై ఉంచాలంటూ ప్రజలకు పిలుపు

cr-20240430tn6630dac98ad62.jpg

సీఎం జగన్ ఇవాళ కడప జిల్లా మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి గురించి మాట్లాడారు. పక్కనే ఉన్న అవినాశ్ రెడ్డిని చూపిస్తూ... ఎడమవైపున నా తమ్ముడు అవినాశ్ ఉన్నాడు... యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది... ఇంత మంచి మనసున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అని కొనియాడారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచాల్సిందిగా కోరుతున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. 

"ఈ జిల్లాలో మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానాల వల్లే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు... ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు... మీ ప్రేమాభిమానాలు, దీవెనలే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి" అని సీఎం జగన్ వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan fires on opposition's false propaganda on Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివరణ ఇచ్చిన సీఎం జగన్

01-05-2024 Wed 16:29 | Andhra

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ ఎన్నికల సభ

విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం జగన్

భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి

చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

cr-20240501tn6632207bdf02a.jpg

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. 

సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ, చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ, భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు.

"వందేళ్ల కిందట బ్రిటీష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు... భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం. 

భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును నవీకరించి, ఆ వివరాలతో రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే... చేతనైతే మద్దతు పలకాలి కానీ, దుష్ప్రచారం చేయడం తగదు" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

CM Jagan Appeal to those who did not vote for Him in Last Elections | YSRCP Meeting Eluru |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్

03-05-2024 Fri 16:33 | Andhra

లకలకా లకలకా అంటూ రక్తాన్ని పీల్చుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న సీఎం

పెదకూరపాడు బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత

cr-20240503tn6634c466d9fef.jpg

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘జరగబోతోంది కురుక్షేత్ర యుద్ధం. ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు మాత్రమే ఓటు వేయడం లేదు. మీరు వేసే ఓటు ఇంటింటి భవిష్యత్‌ను, పథకాల కొనసాగింపును నిర్ణయించబోతోంది. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమేనని ఆలోచించాలని ప్రతి ఒక్కర్నీ కోరుతున్నాను. చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యం ఇదేనని గుర్తెరగాలని కోరుకుంటున్నాను. సాధ్యం కాని రీతిలో ఆయన ఇచ్చిన హామీల అర్థం ఇదేనని గుర్తించాలని అందరినీ కోరుతున్నాను’’ అని చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..
చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రముఖిని నిద్రలేపితే మళ్లీ ఇంటింటికీ ‘లకలకా లకలకా’ అంటూ మీరు రక్తం తాగేందుకు వస్తుంది’’ అనే ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని జగన్ అన్నారు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. చంద్రబాబుని ఓడించడానికి, పేదలను గెలిపించడానికి మరోసారి విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, కురాన్ లాంటిదని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు సెంటర్‌ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan Kosam Siddham: మరో 11 రోజుల్లో ఎన్నికలు... వైసీపీ కొత్తగా చేపట్టిన కార్యక్రమం ఇదే!

02-05-2024 Thu 19:00 | Andhra

ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం కార్యక్రమాలు తీసుకువచ్చిన వైసీపీ

తాజాగా 'జగన్ కోసం సిద్ధం' అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం

ప్రతి ఇంటికీ వైసీపీ మేనిఫెస్టోను చేరవేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం

cr-20240502tn663395751a03d.jpg

గడప గడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన వైసీపీ... మరో 11 రోజుల్లో ఎన్నికలు రానుండగా కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం పేరు... 'కలలు నిజం చేయడానికి.... జగన్ కోసం సిద్ధం'. ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్ లు, పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. 

ఇటీవల సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ చేరవేయడమే 'జగన్ కోసం సిద్ధం' కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లని ఇటీవల సభల్లో తరచుగా చెబుతున్న సీఎం జగన్... ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా తమ ప్రచార పర్వంలో భాగం చేయనున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

LIVE : హిందూపురంలో సీఎం వైయస్ జగన్ బహిరంగ సభ! హిందూపురం సిద్ధం! | YSRCP | YSJaganAgain |VoteForFan

 

  • Love 1
Link to comment
Share on other sites

  • 1

CM YS Jagan Goosebumps Speech at Nellore Public Meeting | Chandrababu | AP Elections @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

CM Jagan clarifying on Land Titling Act.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి?

ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో!

 

Link to comment
Share on other sites

  • 0

YSRCP: ఏపీలో జరిగే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధం: ఏపీ సీఎం జగన్

06-05-2024 Mon 15:50 | Andhra

పథకాల కొనసాగింపునకు వైసీపీకి ఓటు వేయాలన్న జగన్

ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పిన సీఎం

ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకే జమచేశామన్న జగన్

cr-20240506tn6638aee3cc1ec.jpg

మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చెప్పారు. కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకునే ఎన్నికలు కావని, ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పారు. రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో రంగురంగుల కాగితాల్లో మేనిఫెస్టోలు ప్రకటించి ఎన్నికలయ్యాక వాటిని చెత్తబుట్టలోకి విసిరేస్తారని ప్రతిపక్షాలను విమర్శించారు.

 వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాక దానిని ఓ భగవద్గీతలాగా, ఖురాన్ లా, బైబిల్ గా భావించి అందులో హామీలను 99 శాతం అమలు చేశామని జగన్ చెప్పారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం, డిజిటల్ మీడియాలో బోధన విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందని జగన్ ప్రభుత్వమేనన్నారు. ప్రతివిద్యార్థికి ట్యాబ్ లు,  ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశామని చెప్పారు.

మహిళల సాధికారత కోసం ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, కాపు నేస్తం, చేయూత, ఓబీసీ నేస్తం అందిచడంతోపాటు వారి పేరిట ఇళ్ల స్థలాలు కూడా అందించామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని జగన్ కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ.. చంద్ర‌బాబును న‌మ్మితే మ‌రోసారి మోస‌పోవ‌డం ఖాయ‌మ‌న్న సీఎం!

06-05-2024 Mon 13:40 | Andhra

ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఎన్నిక‌ల‌న్న జ‌గ‌న్‌

ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగాలంటే జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని వ్యాఖ్య‌

చంద్ర‌బాబు మోసాల చ‌రిత్ర‌ను గుర్తు తెచ్చుకోండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు 

చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ నోట్లో త‌ల‌కాయ పెట్ట‌డమేన‌ని ఎద్దేవా

cr-20240506tn66389161a9b48.jpg

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లెలో రోడ్ షోలో పాల్గొన్నారు. రేపల్లెలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. మండుటెండ‌ను సైతం లెక్క చేయ‌కుండా త‌న కోసం త‌ర‌లివ‌చ్చిన జ‌నాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌రో వారం రోజుల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు కేవ‌లం ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ఎన్నుకునే ఎన్నిక‌లు మాత్ర‌మే కావ‌న్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భ‌విష్య‌త్తును నిర్ణ‌యించ‌బోయే ఎన్నిక‌ల‌ని తెలిపారు. జ‌గ‌న్‌కు ఓటు వేస్తే ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగుతాయ‌ని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే ప‌థ‌కాల‌కు ముగింపేన‌ని పేర్కొన్నారు. 

చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ నోట్లో త‌ల‌కాయ పెట్ట‌డమేన‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీల‌ను గుప్పించి మోసం చేస్తున్నార‌ని, ప్ర‌తిఒక్క‌రూ ఈ విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో త‌న 59 నెల‌ల పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని మార్పులు తీసుకువ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. రూ. 2.70 లక్ష‌ల కోట్ల రూపాయ‌లు బ‌ట‌న్ నొక్కి, నేరుగా అక్క‌చెల్లె‌మ్మ‌ల కుటుంబాల ఖాతాల్లోకి జ‌మ చేసిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమ‌లు చేసిన ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని అన్నారు. 

ఇక వైసీపీ స‌ర్కార్ తీసుకొచ్చిన పథ‌కాల‌ను ఈ సంద‌ర్భంగా సీఎం మ‌రోసారి గుర్తు చేశారు. అవ్వాతాత‌ల‌కు ఇంటి వ‌ద్ద‌కే రూ. 3 వేల పెన్ష‌న్‌, ఇంటి వ‌ద్ద‌కే పౌర సేవ‌లు.. ఇలా ఇంటికే వ‌చ్చే పాల‌న‌గానీ, ప‌థ‌కాలుగానీ గ‌తంలో ఎప్పుడైనా చూశారా అని ప్ర‌శ్నించారు. అలాగే అన్న‌దాత‌ల సంక్షేమం కోసం చేప‌ట్టిన రైతుభ‌రోసా, ప‌గ‌టి పూట 9 గంట‌ల ఉచిత విద్యుత్ వంటి వాటిని కూడా ప్ర‌స్తావించారు. ఆటోలు, ట్యాక్సీలు న‌డుపుతున్న డ్రైవ‌ర్ల కోసం వాహ‌న మిత్ర‌, నేత‌న్న‌ల కోసం నేత‌న్న నేస్తం, మ‌త్స్య‌కారుల‌కు మ‌త్స్య‌కార భ‌రోసా, లాయ‌ర్లు లా నేస్తం ఇలా ప్ర‌తిఒక్క‌రికీ ఏదో ఒక ప‌థ‌కం తీసుకొచ్చి ఆదుకున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఇలా స్వ‌యం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడైనా జ‌రిగిన దాఖ‌లాలు లేవ‌న్నారు. 

అటు పేద‌ల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని ఆరోగ్య‌శ్రీని విస్త‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌స్తుతం రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం అందిస్తున్న‌ట్లు తెలిపారు. నాడు-నేడు పేరిట ఇంగ్లీష్ మీడియం బడులు, గ్రామానికే ఫైబ‌ర్ గ్రిడ్‌, డిజిట‌ల్ లైబ్ర‌ర‌రీ, అక్క‌చెల్లెమ్మ‌ల కోసం దిశ యాప్ ఇలా గ‌తంలో లేని ఎన్నో మంచి కార్యక్ర‌మాల‌ను తమ ప్రభుత్వం తీసుకొచ్చింద‌న్నారు. 

14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా చేసిన చంద్ర‌బాబు పేరు చెబితే ఒక్క మంచిప‌ని కూడా గుర్తు రాద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఆయ‌న పేరు చెబితే ఒక్క మంచి ప‌థ‌కం కూడా పేదోడికి గుర్తు రాద‌ని, ఇలాంటి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల‌న్నారు. ఆయ‌న అధికారంలోకి వ‌స్తే మాయ‌లు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్‌లెంట్ (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని ఎద్దేవా చేశారు. అందులో పేర్కొన్న హామీల‌ను ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చ‌దివి వినిపించారు. ఇందులో ఒక్క హామీ కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌ళ్లీ ఇప్పుడు పొర‌పాటున ఆయ‌న‌కు ఓటు వేస్తే అప్ప‌టి ప‌రిస్థితినే వ‌స్తుంద‌ని, జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ విజ్ఞప్తి చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

CM Jagan Full Speech at Machilipatnam | YSRCP Public Meeting | AP Elections 2024 |@SakshiTV

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on continuance of welfare schemes: మీ బిడ్డకు ఓటేస్తే పథకాల కొనసాగింపు... చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు: సీఎం జగన్

07-05-2024 Tue 14:59 | Andhra

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ సభ

ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్న సీఎం జగన్

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా అంటూ విమర్శలు

చంద్రబాబు గత చరిత్రను ఓసారి చూడాలని ఓటర్లకు పిలుపు

cr-20240507tn6639f4912674c.jpg

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్ లో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

తనను గద్దె దింపేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని అన్నారు. ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని, జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమే తప్ప జరిగేదేమీ ఉండదని, చంద్రబాబు గత చరిత్రను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు సార్లు సీఎంను అంటాడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు... మరి చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. 

తాము ఈ ఐదేళ్ల కాలంలో అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పాఠశాలల్లో గోరుముద్ద, పిల్లలకు ట్యాబ్ లు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్ లు, విద్యాకానుక, అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్, 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఆసరా, చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, రైతన్నకు పెట్టుబడి సాయం, పగటిపూట ఉచితంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆర్బీకే వ్యవస్థలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి వాహన మిత్ర సాయం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, చేదోడు వాదోడు పథకం, న్యాయవాదుల కోసం లా నేస్తం, రూ.25 లక్షల వరకు పెంపుతో ఆరోగ్య శ్రీ, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, 60-70 ఇళ్లకు ఓ వాలంటీరు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, ఇంటి వద్దకే రేషన్ బియ్యం... ఈ పథకాలన్నీ మేం అమలు చేస్తున్నాం అని సగర్వంగా చెప్పుకోగలమని సీఎం జగన్ వివరించారు. 

సైకిల్ కు బాగా తుప్పు పట్టిపోయిందని, అందుకే ఢిల్లీ నుంచి మెకానిక్ లను పిలిపించుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పూర్తిగా డ్యామేజి అయిన సైకిల్ ను తాము బాగు చేయలేమని ఢిల్లీ మెకానిక్ లు తేల్చి చెబితే, పిచ్చిచూపులు చూస్తున్న చంద్రబాబు బెల్ కొట్టడం మొదలుపెట్టాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ బెల్ పేరే మేనిఫెస్టో అని అన్నారు. 

అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని, అందుకు నిదర్శనం 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోయేనని పేర్కొన్నారు. 

ఎన్నికల ముందు అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేస్తున్న చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి ఇప్పుడు బటన్ లు నొక్కిన సొమ్ము కూడా రాకుండా అడ్డుకుంటున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు. తానేమీ ఎన్నికలు వస్తున్నాయని ఇప్పటికిప్పుడు బటన్ నొక్కలేదని, గత ఐదేళ్లుగా బటన్లు నొక్కుతూనే ఉన్నానని వెల్లడించారు. అందుకే చంద్రబాబు కుట్రలకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on Chandrababu: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్ తీవ్ర విమర్శలు

09-05-2024 Thu 17:34 | Andhra

టీడీపీ అధినేత గత చరిత్ర ఇదేనని విమర్శించిన వైసీపీ అధినేత

2014లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని విమర్శలు

ప్రధానమంత్రితో సభలు నిర్వహించి కనీసం ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేకపోయారని మండిపాటు

cr-20240509tn663cbbc0d61b2.jpg

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదేనని, అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థమని, మోసపోవద్దని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారంలో భాగంగా రాజంపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

విమర్శించిన నోటితోనే పొగిడిపోయారు.. ప్రధానిపై జగన్ విమర్శలు
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నారని, ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ప్రజలు ఎదురుచూశారని, కానీ ప్రత్యేక హోదా ప్రకటన కూడా చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. పెత్తందారుల సభలతో ప్రజలకు నిరాశే మిగిలిందని, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.  ‘‘చంద్రబాబుకు ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకు ఏం కావాలి, దుష్టచతుష్టయానికి ఏం కావాలి. అన్నీ వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడారు. మన మీద నాలుగు రాళ్లు వేశారు. మొన్నటి దాకా చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ ఉండరన్న మోదీ... ఇప్పుడు వాళ్ల కూటమిలో చేరారు, అదే నోటితో పొగిడారు’’ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు?
‘‘ఎన్డీయే ఏపీ అజెండాతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లాభం జరిగింది? ఇదే నాయకులు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ మాటలు చెబుతున్నారు. మరి 2014లో ప్రకటించిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎందుకు పిలుస్తున్నారు’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోవైపు ఐదేళ్లక్రితం ఇచ్చిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేసిన తాను ఉన్నానని, ఇంటింటికీ పథకాలు ఇచ్చి తాను ఆశీర్వాదం కోరుతున్నానని అన్నారు. 

సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అన్ని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, ప్రతి ఇల్లూ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అని జగన్ అన్నారు. ఏపీ ప్రజలందరూ మళ్లీ మోసపోతారని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Jagan on kootami and the poor: ఎన్డీఏ కూటమితో పేదలకు నష్టం: సీఎం జగన్

09-05-2024 Thu 16:18 | Andhra

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ధ్వజం

సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించనివ్వకుండా ఈసీపై ఎన్డీఏ ఒత్తిడి చేసిందని మండిపాటు

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిదేనని స్పష్టీకరణ

cr-20240509tn663caa119acbe.jpg

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా జతకడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని జగన్ ధ్వజమెత్తారు. ముస్లింలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం లో గురువారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బులు చెల్లించనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.

సుమారు రూ.14,165 కోట్ల చెల్లింపులకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వలేదని జగన్ చెప్పారు. ఓ వైపు తెలంగాణలో రైతులకు డబ్బులు చెల్లించేందుకు అనుమతులిచ్చిన ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి కుట్రలు చేసి ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల కమిషన్ తమకు అనుమతినివ్వలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి అమలులో ఉన్న సంక్షేమ పథకాల చెల్లింపునకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వకపోవడానికి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే కారణమని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే మరో ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ఓటు వేయకుంటే నవరత్నాల పేరుతో ఉన్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ఆపేస్తారని జగన్ చెప్పారు. మేనిఫెస్టో విశ్వసనీయతకు అర్థం చెప్పింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ద్వారా మౌలిక వసతుల కల్పించామని, ఇంగ్లిషు మీడియంలో బోధన తీసుకొచ్చామని తెలిపారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఇంటివద్దకే పౌర సేవలు అందించేలా ఈ ఐదేళ్ల కాలం పాలించామని చెప్పారు.

చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చెప్పుకోదగ్గ పనులు లేకే ఇతర పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్తున్నారని జగన్ విమర్శించారు. 2014లో రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఏనాడు పేదవారికి సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు...ఇప్పుడు పేదలకు జగన్ భూములు, ఇళ్లు ఇస్తుంటే ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.

...

Complete article

AP CM YS Jagan Public Meeting at Kalyanadurgam | AP Elections 2024 | Anantapur District@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

CM Jagan on taking money from TDP and voting for YCP: చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోండి, ఓటు నాకే వేయండి - జగన్

AP Elections 2024: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశారు.

21533f02bd2c33627eb7151f0b51818f17152593

CM Jagan Comments: టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు ఇచ్చే రూ.వెయ్యి, రూ.2 వేలకు ప్రజలు మోసపోవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు. మీ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే ఉంటుందని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు డబ్బులు పంచితే తీసుకోవాలని.. ఓటు మాత్రం జగన్ కే వేయాలని కోరారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని.. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తాను దోచుకున్న సోమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయన ఇచ్చే వెయ్యి, రెండు వేలకు ప్రజలు మోసపోవద్దని పిలుపు ఇచ్చారు. మీ బిడ్డ జగన్ మళ్ళీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం ఏ నెల ఏయే పథకాలు వస్తాయో, దేనికి డబ్బులు అందుతాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తామని చెప్పారు. గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే.. ఉంటుందని అన్నారు. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలని పిలుపు ఇచ్చారు.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికి తన సంతకంతో మేనిఫెస్టో పంపారని జగన్ గుర్తు చేశారు. ఆ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్లే అవుతుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా సభల్లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడం లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్లకు కావాల్సినవి మాత్రమే మాట్లాడారని జగన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నారని.. ఆరునూరైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. 

2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం డబ్బులు వేయడానికి అనుమతిచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు నిరాకరించిందని జగన్ విమర్శించారు. కూటమి పార్టీల ఒత్తిడి, ఫిర్యాదుల వల్లే ఈ డబ్బులు పేదలను చేరకుండా ఈసీ అడ్డుకుందని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

ఊరూరా జగన్ కు అపూర్వ నీరాజనం | CM YS Jagan bus tour | AP Elections 2024 - TV9

 

Link to comment
Share on other sites

  • 0

CM YS Jagan Powerful Speech At Mangalagiri Public Meeting | AP Elections 2024 |@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

CM YS Jagan High Voltage Speech | Chandrababu | YS Avinash Reddy | Kadapa | @SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

AP CM YS Jagan Public Meeting at Kadapa | AP Elections 2024 | YSR Kadapa District@SakshiTVLIVE

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: పద్మవ్యూహంలో బలవ్వడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు: సీఎం జగన్ ట్వీట్

11-05-2024 Sat 20:11 | Andhra

ఏపీలో మే 13న పోలింగ్

ఎన్నికల మహా సంగ్రామంలో విజయం మనదే అంటూ సీఎం జగన్ ధీమా

కృష్ణుడి వంటి ప్రజలు తన వెంట ఉన్నారంటూ ట్వీట్

cr-20240511tn663f841033293.jpg

ఏపీ సీఎం జగన్ ఎల్లుండి (మే 13) పోలింగ్ నేపథ్యంలో తన సమర సన్నద్ధతను చాటారు. తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎన్నికల మహా సంగ్రామంలో పచ్చ మంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు అని స్పష్టం చేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడి వంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు... ఈ యుద్ధంలో విజయం మనదే అని ఉద్ఘాటించారు. 

"వారి వ్యూహాల్లో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్దానాల్లో... వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. కానీ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి ప్రజల అండ, దేవుడి దయ తోడుగా ఉన్నాయి. అందుకే మీ బిడ్డ ఇలాంటి పద్మవ్యూహాలకు భయపడడు. మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు" అంటూ ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సీఎం జగన్ పంచుకున్నారు.

...

Complete article

మీ అర్జునుడు! ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం మనదే!

 

Link to comment
Share on other sites

  • 0

YS Jagan: పిఠాపురంలో గెలిస్తే... వంగా గీతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్

11-05-2024 Sat 18:26 | Andhra

కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభ

హాజరైన సీఎం జగన్

దత్తపుత్రుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం

కార్లను మార్చినట్టు భార్యలను మార్చే వ్యక్తి అంటూ విమర్శలు

దత్తపుత్రుడు గెలిచినా పిఠాపురంలో ఉండడని వెల్లడి

ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట!

cr-20240511tn663f6aff00dff.jpg

కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, దత్తపుత్రుడు అంటూ ధ్వజమెత్తారు.

మేనిఫెస్టోలో ఇచ్చింది అడ్డగోలు హామీలు అని తెలిసి కూడా, రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్కచెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అంటూ చంద్రబాబుకు దత్తపుత్రుడు కత్తి అందిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? అని ప్రశ్నించారు. 

"ఈ దత్తపుత్రుడ్ని నా అక్కచెల్లెమ్మలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచించాలి. ఒకసారి జరిగితే పొరపాటు... రెండోసారి జరిగితే గ్రహపాటు... అదే మూడోసారి, నాలుగోసారి జరిగితే అలవాటు కాదా? 

ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్కచెల్లెమ్మ అయినా పని నిమిత్తం దత్తపుత్రుడ్ని కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్లి ఏ మహిళ అయినా పని అడగ్గలరా? 

ఈ దత్తపుత్రుడి గురించి ఇంకో విషయం కూడా చెబుతున్నా. ఈ దత్తపుత్రుడికి ఓటేసి గెలిపిస్తే, అతడు పిఠాపురంలో ఉంటాడా? ఈ దత్తపుత్రుడికి ఈ మధ్యనే జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది... ఇప్పుడు పిఠాపురం!

ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందా? మరో పక్క నా తల్లి (వంగా గీత) ఇక్కడుంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్నా... మా తల్లిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి... ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట! 

చివరగా మరొక్క మాట... చంద్రబాబు ప్రలోభాలకు మీరెవరూ మోసపోవద్దు. ఐదేళ్లు మీ బిడ్డ పాలన చూశారు. ఏ నెలలో అమ్మ ఒడి ఇస్తాను, ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో చేయూత ఇస్తాను అని క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేశాను. 

చంద్రబాబు మాటలు నమ్మి వచ్చే ఐదేళ్లలో జరిగే మంచిని పోగొట్టుకోవద్దు. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మా అక్కచెల్లెమ్మలకు అందాలన్నా, పేదల భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే... ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయాలి.

ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు... ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు.... అందరూ సిద్ధమేనా?" అంటూ సీఎం జగన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
59 minutes ago, TELUGU said:

YS Jagan: పిఠాపురంలో గెలిస్తే... వంగా గీతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్

ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట!

ఈ దత్తపుత్రుడికి ఓటేసి గెలిపిస్తే, అతడు పిఠాపురంలో ఉంటాడా? ఈ దత్తపుత్రుడికి ఈ మధ్యనే జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది... ఇప్పుడు పిఠాపురం! ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్కచెల్లెమ్మ అయినా పని నిమిత్తం దత్తపుత్రుడ్ని కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్లి ఏ మహిళ అయినా పని అడగ్గలరా?

Wow! Deputy CM is a rod to poonakam kalyan 🤣

kootami candidates are non-local/non-resident andhrites (NRA) including fitness star and cbn

Link to comment
Share on other sites

  • 0

Jagan on reservations to Muslims

ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!

ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా?

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...