Jump to content
  • 0

Chandrababu: ఏపీని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం (drugs)


TELUGU

Question

వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.

chandrababu_naidu_vijayawad_2d61bf9f84_V

డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు కోరారు.

...

Complete article

Link to comment
Share on other sites

Recommended Posts

  • 0

Daggubati Purandeswari: సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు

రూ.20 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి

సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

cr-20240403tn660d6fc7dfbe5.jpg

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, సీఎం జగన్ కు పురందేశ్వరి ఈ నెల 1న లీగల్ నోటీసులు పంపారు. 

సాక్షి పేపర్లో గత నెల 22 నుంచి 24 వరకు వరుసగా మూడ్రోజుల పాటు  తనపై అసత్య కథనాలు ప్రచురించారని పురందేశ్వరి ఆరోపించారు. సంధ్యా ఆక్వా కంపెనీలో తన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి ఆ కంపెనీకి, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంధ్యా ఆక్వా యాజమాన్యంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు.  


సాక్షి పత్రిక ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్స్ పరువునష్టం కింద రూ.20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురందేశ్వరి తన న్యాయవాది వీవీ సతీశ్ ద్వారా లీగల్ నోటీసు పంపారు. 

తాజాగా, ఈ అంశంపై పురందేశ్వరి సోషల్ మీడియాలో స్పందించారు. డ్రగ్స్ కేసులో దోషులను, అసలు నిజాలను దాచిపెడుతున్న వైసీపీ నేతలు ప్రతిపక్షాల మీద నెట్టివేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా ఆక్వా కంపెనీతో, తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ఎలాంటి మచ్చ లేని నా రాజకీయ జీవితంపై జగన్, అతని అనుచరులు జగతి పబ్లికేషన్స్ ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ న్యాయపరమైన పోరాటం చేస్తున్నానని పురందేశ్వరి వెల్లడించారు.

...

Complete article

20240403fr660d6f2a0cbfc.jpg

20240403fr660d6f36e645e.jpg

20240403fr660d6f433ac33.jpg

20240403fr660d6f4e2e808.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Restore formatting

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...